NEWS

NEWS

ఒకే ఒక్కడు.. నిగ్గదీసి అడుగుతున్న ఉక్కుగళం కే.సి.ఆర్‌..!

ఏం ‌మాట్లాడితే ఏమవుతుందో, ఏ దాడి జరుగుతుందో, ఏ కేసు పడుతుందో, ఏ ముద్ర వస్తుందో, ఏ దర్యాప్తు సంస్థ పిలుస్తుందో అని దేశం దేశమే భయమనే బందిఖానాలో స్వచ్ఛందంగా తనను తాను ఖైదుచేసుకొని నోరు మెదపడానికి, గొంతు విప్పడానికి జంకుతున్న తరుణంలో తన రాజకీయ బలమెంత, బలగమెంత అనే లెక్కలు వేసుకొని ఆగిపోకుండా గుప్పెడంత…

రాజ‘పక్షే’లు, ప్రజా‘పక్షాలు’ఎవరో ప్రజలు తేలుస్తారు..?

నరేంద్రమోదీ తెలంగాణ గడ్డ హైదరాబాద్‌ ‌మీద బిజెపి సమరనాదం వినిపిస్తే కేసియార్‌కు అది ఎన్నికల శంఖారావంగా వినిపించింది. అమిత్‌ ‌షా, తరుణ్‌ ‌చుగ్‌, ‌నడ్డా ఏదో ఒక రూపంలో కేసియార్‌కు దమ్ముంటే అసెంబ్లీ రద్దుతో ఎన్నికలకు రమ్మని సవాళ్ళు విసరడం మొదలైంది. మా ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఉండమని ఆశీర్వదించారన్న ముఖ్యమంత్రి బిజెపి కి దమ్ముందా…

పోడుభూములకు పట్టాలివ్వాలి..

గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసిన ప్రతిపక్ష పార్టీల నేతలు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : పోడుభూములకు పట్టాలు ఇవ్వాలనీ, ఆదివాసీలపై, అడివి ప్రాంతంలో రైతులపై ఫారెస్టు, పోలీసు దాడులను ఆపాలనీ, కోయపోశగూడెం, పాల్వంచ, అడివి రామవరం తదితర ప్రాంతాల్లో ప్రజలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనీ కోరుతూ మంగళ…

వరవరరావు బెయిల్‌ ‌పొడిగింపు

విచారణను 19కి వాయిదా వేసిన సుప్రీమ్‌ ‌కోర్టు న్యూ దిల్లీ, జూలై 12: ‌విప్లవకవి వరవరరావు మెడికల్‌ ‌బెయిల్‌ను సుప్రీమ్‌ ‌కోర్టు మరోసారి పొడిగించింది. భీమా కోరెగావ్‌ ‌కేసులో నిందితునిగా ఉన్న వరవరరావు వైద్య కారణాల రీత్యా తనకు శాశ్వత బెయిల్‌ ఇవ్వాలని బాంబే హైకోర్టును కోరారు. ఆ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టేయడంతో..దాన్ని సవాల్‌…

హైదరాబాద్‌లో మరో రెండ్రోజులు వర్షాలు

ఈదురుగాలులతో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక చెట్లకిందకు పోరాదని జిహెచ్‌ఎం‌సి వార్నింగ్‌ ‌నిండుకుండలా జంట జలాశయాలు, హుస్సేన్‌ ‌సాగర్‌ ‌వనస్థలిపురం సహారా ఎస్టేట్‌లో చెట్టుకూలి మహిళ మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : అల్పపీడనం ప్రభావంతో నగరాన్ని ముసురు వాన కమ్ముకున్నది. వరుసగా ఐదో రోజు హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండగా.. పలుచోట్ల…

రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు…

నిండుకుండలా మారిన ప్రాజెక్టులు మత్తడి దుంకుతున్న చెరువులు భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం దుమ్ముగూడెం వద్ద వంద కుటుంబాల తరలింపు ఉప్పొంగుతున్న మంజీన నది..జలదిగ్బంధంలో వలిమెల ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో భారీ వర్షాలు….మత్తడి పారుతున్న భద్రకాళి చెరువు జూరాలకు పెరుగుతన్న వరద…నెట్టెంపాడుకు నీటి విడుదల ఇలెందు సింగరేణి ఓపెన్‌ ‌కాస్టుల్లోకి భారీగా వరదనీరు…నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి…

ముందస్తుకు సై అంటున్న రాజకీయ పార్టీలు

ముందస్తు ఎన్నికలకు రాజకీయ పార్టీలుకూడా సిద్ధమంటున్నాయి.. నిన్నటివరకు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ వొచ్చిన ఈ పార్టీలు ఇప్పుడు తాము కూడా సిద్ధ్దమేనంటు ప్రకటనలు చేస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయను కున్నప్పుడు సహజంగా అధికార పార్టీ ముందుచూపుగా ముందస్తు ఎన్నికలకు సిద్ధ్దమవుతాయి. 2018లో టిఆర్‌ఎస్‌…

దేశంలో నిలకడగా కొరోనా రోజువారీ కేసులు

కొత్తగా 13,615 మందికి పాజిటివ్‌…20 ‌మంది మృతి న్యూ దిల్లీ, జూలై 12: దేశంలో కొరోనా కేసుల సంఖ్య కొంచెం అటుఇటుగా నిలకడగా ఉంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,615 మంది వైరస్‌ ‌బారినపడగా.. మరో 20మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌ ‌నుంచి తాజాగా 13,265 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి…

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్ల్లో భారీ వర్షాలు

గుజరాత్‌, ‌మహారాష్ట్రల్లో వర్ష బీభత్సం కేరళలో జోరువానలతో అతలాకుతలం న్యూ దిల్లీ, జూలై 12 : దేశవ్యాప్తంగా పలు రాష్టాల్ల్రో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉరకలేస్తున్నాయి. రోడ్లపై వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్‌ అం‌తరాయం ఏర్పడుతోంది. ఈదురుగాలులు, జడివానల దెబ్బకు భారీ చెట్లు,…