బిఆర్‌ఎస్‌ అం‌డతోనే ఎపి జలదోపిడీ

కృష్ణా జలాల్లో 200 టిఎంసిలు చాలన్న ఘనులు
శ్రీశైలం, సాగర్‌లను ఎపికి అప్పగించి చోద్యం చూశారు
తమను అప్రతిష్ట పాలు చేసేందుకే తప్పుడు ఆరోపణలు
జేబులు నింపుకునేందుకే నాడు ప్రాజెక్ట్ ‌ల నిర్మాణం
మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌, ‌పొన్నం ప్రభాకర్‌, ‌కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి 

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ బిఆర్‌ఎస్‌ ‌పాలనలోనే అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖమంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  స్పష్టం చేశారు. కృష్ణా నది జలాలు ఆంధ్రా పాలకులు ఉల్లంఘనలను అతిక్రమించి దోచుకపోతుంటే సహకరించిన బిఆర్‌ఎస్‌ ‌పాలకులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్నీ అప్రతిష్ట పాలు చేసెందుకు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా నది జలాల వివాదంపై గురువారం జలసౌధ లో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి లతో కలిసి మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు అప్పుడేమో ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వంతో అలయ్‌ ‌బలాయ్‌ ‌చేసుకున్న బిఆర్‌ఎస్‌ ‌పాలకులు అప్పుడే ఉల్లంఘనలపై స్పందించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు టెలిమెట్రి పరికరాలు అమార్చలని చట్టంలో ఉన్నప్పటికీ ఏపీ పాలకులకు నీటి దోపిడీలో సహకరించేందుకే బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అమర్చలేదని ఆయన ఆరోపించారు బిఆర్‌ఎస్‌ ‌పాలనలో నీటిపారుదల రంగాన్ని భ్రష్ఠు పట్టించింది చాలక ప్రస్తుత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఈ ఆరోపణలని ఆయన స్పష్టం చేశారు. కేవలం జేబులు నింపుకునేందుకే ప్రాజెక్ట్ ‌ల నిర్మాణాలు చేపట్టి దోపిడీకి పాల్పడింది కాక ప్రతి విమర్శలు చేయడం విడ్డురంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. ప్రాజెక్ట్ ‌ల నిర్మాణంలో బి.ఆర్‌.ఎస్‌ ‌పాలకులు చేసిన అప్పులు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి భారంగా పరిణమించాయని మండిపడ్డారు. లక్షకోట్లతో ప్రాజెక్ట్ ‌నిర్మించి కొత్తగా ఎకరాకు నీరు అందించలేక పోయారని విమర్శించారు.

అంతే కాదు 25,500 కోట్లు ఖర్చు చేసి కుడా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ‌తో కొత్తగా ఎకరాకు నీరందించలేక పోయారన్నారు సకాలంలో ఎస్‌.ఎల్‌.‌బి.సి,పాలమూరు-రంగారెడ్డి,నెట్టేంపాడు వంటి కృష్ణా బేసిన్‌ ‌లో ప్రాజెక్ట్ ‌లు నిర్మించి ఉంటే ఆంద్రప్రదేశ్‌ ‌కృష్ణా జలాలను దోచుకపోయే ఉండేదా అని ఆయన ప్రశ్నించారు వారి పాలనలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బి.ఆర్‌.ఎస్‌ అధికార కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలకు పూనుకుందని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ధ్వజమెత్తారు ఈ నెల 18,19వ తేదీల్లో రాజస్థాన్‌ ఉదయ్‌ ‌పూర్‌ ‌లో జరిగిన జాతీయ నీటిపారుదల మంత్రుల సదస్సులో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్‌.‌పాటిల్‌ ‌తో పాటు కార్యదర్శి ని కలసి తెలంగాణా రాష్ట్రంలోనీ నీటిపారుదల అంశాన్ని ప్రస్తావించినప్పుడు సానుకూలంగా స్పందించారన్నారు. లక్ష కోట్లకు పైగా అప్పుచేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ఇది తప్పుడు డిజైన్‌, ‌నాసిరకం నిర్మాణం, నిర్వహణ లేకపోవడం వల్ల సమస్యలకు గురైందనిపేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ‘కాలేశ్వరం హృదయం’గా పేర్కొన్న మేడిగడ్డ బ్యారేజ్‌ ‌వారి స్వంత పాలనలో కూలిపోయిందని అటువంటి వైఫల్యాన్ని ఒప్పుకోకుండా, కేసీఆర్‌, ‌హరీష్‌ ‌రావు, ఇతర బీఆర్‌ఎస్‌ ‌నేతలు ఒకే ఒక స్తంభం కూలిపోయిందని నిర్లజ్జగా చెబుతుండడం హాస్యాస్పదంగా మారిందన్నారు. ఆ ప్రాజెక్ట్ ‌నిర్మాణం కోసం వెచ్చించిన నిధులు అధిక వడ్డీ, స్వల్పకాలిక రుణాల ద్వారా పొందారని, ఇది తెలంగాణపై భారీ ఆర్థిక భారం మోపిందన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై రూ. 27,000 కోట్లు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్ట్‌పై రూ. 9,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, ఒక్క ఎకరం భూమికి కూడా నీరు అందలేదన్నారు దేవాదుల, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్‌ ‌సాగర్‌, ఎస్‌ఎల్‌బీసీ మరియు దిండి వంటి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చెయ్యలేక పోయారో బి.ఆర్‌.ఎస్‌ ‌నేతలు తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన ‘ఆల్‌ ఇం‌డియా స్టేట్‌ ‌వాటర్‌ ‌మంత్రుల సమావేశం’లో ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలిపారు. ‘‘కేంద్ర జల్‌ ‌శక్తి మంత్రి సి.ఆర్‌. ‌పటేల్‌, ‌జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై తగిన మార్గదర్శకాలు ఇస్తామని హామీ ఇచ్చారు,’’ అని ఆయన తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్ట్ ‌కోసం గోదావరి నది జలాల 67 టీఎంసీ కేటాయింపును వేగవంతం చేశామని, సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ ‌కోసం 44 టీఎంసీ కేటాయింపుకు చర్చలు జరుగుతున్నాయన్నారు సమ్మక్క సారక్క ప్రాజెక్ట్‌పై ఛత్తీస్‌గఢ్‌తో నో ఒబ్జెక్షన్‌ ‌సర్టిఫికేట్‌ (ఎన్‌ఓసీ) కోసం కార్యదర్శితో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నారు అదనంగా, తెలంగాణకు 299 టీఎంసీ, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీ కేటాయింపుతో అన్యాయమైన కృష్ణా నది జల కేటాయింపును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్నారు. క్యాచ్‌మెంట్‌ ‌ప్రాంతం, కరువు ప్రభావిత ప్రాంతాలు, జనాభా, సాగు భూమి వంటి అంశాల ఆధారంగా జల కేటాయింపు జరుగుతుంది, కానీ తెలంగాణ తన న్యాయమైన వాటాను ‘‘కేసీఆర్‌ ‌నాయకత్వంలో తెలంగాణ కోల్పోయిందని ఆయన చెప్పారు. కృష్ణా రివర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు (కేఆర్‌ఎం‌బీ) సమావేశాల మినిట్స్‌ను ఆయన ఉటంకిస్తూ బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కేఆర్‌ఎం‌బీకి కీలక ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించిన విధానాన్ని బయటపెట్టారు.

‘‘బీఆర్‌ఎస్‌ ‌తరహాలో మా ప్రభుత్వం మా ప్రాజెక్టులను కేఆర్‌ఎం‌బీకి అప్పగించదని ఆయన సుస్పష్టం చేశారు. ఆపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశాన్ని వాయిదా వేయడం ద్వారా బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌స్కీమ్‌ (ఆర్‌ఎల్‌ఐఎస్‌) ‌కోసం టెండర్లను పిల వడానికి అనుమతించిందని ఆయన ఆరోపించారు. ‘‘కేసీఆర్‌, అప్పటి ఏపీ సీఎం జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి మధ్య రహస్య ఒప్పందం కుదిరిన కొన్ని రోజుల తర్వాతే ఆర్‌ఎల్‌ఐఎస్‌ ‌ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించిందన్నారు. తెలంగాణకు సహజంగా ప్రవహించే 7 టీఎంసీ కృష్ణా నీటిని కోల్పోయింది, కానీ ఆంధ్రప్రదేశ్‌కు శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీ నీటిని తీసుకునేందుకు అనుమతి లభించింది,’’ అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం 2020 మే 5న జారీ చేసిన జీవో నం. 203ను ఆయన ప్రస్తావించారు, ఇది రోజుకు 8 టీఎంసీ నీటిని ఉపసంహరించుకునేందుకు అనుమతించిందన్నారు. కేఆర్‌ఎం‌బీ డేటా ప్రకారం, 2014-15 నుంచి 2020-21 మధ్య ఆంధ్రప్రదేశ్‌ ‌కృష్ణా నది జలాల్లో 64% పైగా వినియోగించుకున్నప్పటికీ, తెలంగాణ వాటా 36% కంటే తక్కువగా ఉంది. 2014-15లో, ఏపీ 529.33 టీఎంసీ నీటిని ఉపయోగించుకోగా, తెలంగాణ కేవలం 227.74 టీఎంసీ (30.08%) మాత్రమే పొందింది. 2020-21 నాటికి, ఏపీ వినియోగాన్ని 629.07 టీఎంసీకి పెంచగా, తెలంగాణకు కేవలం 248.23 టీఎంసీ లభించిందన్నారు. ‘‘ఈ స్పష్టమైన ఉల్లంఘనలపై అప్పటి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏ చట్టపరమైన చర్యఎందుకు. తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. వారు ఏపీకి అనుమతిచ్చి, వారి ప్రాజెక్టులను విస్తరించేందుకు మార్గం సుగమం చేశారు,’’ అని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు.

2014 నుంచి, ఆంధ్రప్రదేశ్‌ ‌శ్రీశైలం నుంచి నీటిని ఉపసంహరించుకునే సామర్థ్యాన్ని దూసుకుపోతూ పెంచుకుంటూ వొచ్చింది. 2005లో పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌సామర్థ్యం 44,000 క్యూసెక్కులుగా ఉండగా, 2023 నాటికి 92,600 క్యూసెక్కులుగా పెంచబడింది. తెలంగాణ అభ్యంతరాలు తెలిపినా, ఆర్‌ఎల్‌ఐఎస్‌ ‌ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ‌మరియు ఇతర అనుబంధ పథకాలు ఏపీకి మరింత నీటి మళ్లింపు సామర్థ్యాన్ని కల్పించాయి, అయితే తెలంగాణ ప్రాజెక్టులు•కల్వకుర్తి, నెట్టంపాడు, పలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌స్కీమ్‌•నీటి కొరతతో పోరాడుతున్నాయని ఆయన చెప్పారు. ‘‘ఈ బహిరంగ ఉల్లంఘనలపై అప్పటి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టును లేదా కృష్ణా వాటర్‌ ‌డిస్ప్యూట్స్ ‌ట్రిబ్యునల్‌-II (‌కేడబ్ల్యూటీటీ-II)ని ఎందుకు ఆశ్రయించలేదని ఆయన నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, ఏపీ టెండర్లు ఖరారు చేసుకునేంత వరకు ఎదురు చూడటం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు,’’ అని ఆయన ఆరోపించారు. 2023 నవంబరు 29న, తెలంగాణ ఎన్నికలకు ఒక రోజు ముందు, ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం 400-500 మంది సాయుధ పోలీసులతో నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌రైట్‌ ‌హాఫ్‌ను బలవంతంగా ఆక్రమించిందన్నారు. వారు కీలక నియంత్రణ స్థానాలను స్వాధీనం చేసుకుని, కేఆర్‌ఎం‌బీ అనుమతి లేకుండానే 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారన్నారు.

‘‘ఇది తెలంగాణ హక్కులపై నేరుగా దాడి. అయినా, బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవడంలో విఫలమైంది,’’ అని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్‌ ‌నగర్‌, ‌నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో రైతులు నీటి కొరత కారణంగా తీవ్రంగా నష్టపోయారని, హైదరాబాద్‌ ‌తాగునీటి సరఫరా కూడా ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ‌నీటి ఉపసంహరణను పర్యవేక్షించేందుకు, నాగార్జునసాగర్‌ ‌మరియు శ్రీశైలం డ్యామ్‌ల వద్ద 35 ప్రదేశాల్లో టెలిమెట్రీ పరికరాలను అమర్చాలని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ‘‘కేంద్రం నిధులు ఇవ్వకపోయినా, తెలంగాణ స్వంత ఖర్చుతో వీటిని అమలు చేస్తుంది,’’ అని స్పష్టం చేశారు.10 సంవత్సరాల బీఆర్‌ఎస్‌ ‌పాలనలో టెలిమెట్రీ పరికరాలు అమర్చని వైఫల్యాన్ని ఆయన దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత, వడ్డీ రేట్లను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. కొన్నిచోట్ల 10% నుంచి 7%కి తగ్గించగలిగాం,’’ అని వివరించారు. సీఎల్‌బీసీ టన్నెల్‌ ‌పనులు 100% పూర్తవుతాయని, అలాగే నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టు పైభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌ ‌నుంచి తిరిగి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన నష్టాన్ని సరిచేయడానికి మా ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోంది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను రక్షించడంలో మా ప్రభుత్వం వెనుకడుగు వేయదు,’’ అని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *