బ్యారేజ్ కుంగడంలో కుట్రకోణం
ఇంజనీర్ ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు
మేడిగడ్డ సేఫ్టీపై కేంద్రబృందం పరిశీలన
మహదేవ్పూర్,ప్రజాతంత్ర,అక్టో
భారీ శబ్దం వచ్చేంతవరకూ బ్యారేజీ బ్రిడ్జిద వాహనాల రాకపోకలు యధావిధిగానే జరిగాయని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 6.20 గంటలకు భారీ శబ్దం వచ్చిందని, ఆ వెంటనే ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ఫోర్మాన్ బిద్యుత్ దేబ్నాధ్తో కలిసి ఘటనా స్థలం దగ్గరికి వెళ్ళి చూశామని, ఏడవ నెంబర్ బ్లాక్లో 19-21 పిల్లర్ల మధ్య ప్రాంతంలో బ్యారేజీ ద ఉన్న రోడ్డు బ్రిడ్జి శ్లాబ్, పిట్టగూడ కుంగిపోయినట్లు గమనించామని, ఇది మహారాష్ట్ర సరిహద్దువైపు చోటుచేసుకున్నదని ఆ ఫిర్యాదులో రవికాంత్ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పబ్లిక్ ప్రాపర్టీ విధ్వంస నిరోధక చట్టంలోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విపక్షాలన్నీ నిర్మాణ లోపం, నాణ్యత లేకపోవడం, మానవ తప్పిదం, ఇంజనీరింగ్ డిజైన్లోనే పొరపాటు ఉండడం.. ఇలాంటి విమర్శలు వస్తున్న సమయంలో పోలీసులకు కుట్ర కోణంలో ఫిర్యాదు చేయడం..పోలీసులు కేసు నమోదు చేయడం ఆసక్తికరంగ మారింది. మరో వైపు మేడిగడ్డ బ్యారేజ్ ను కేంద్ర బృందం పరిశీలించింది.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీ.. మంగళవారం కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించింది. సుమారు రెండు గంటల పాటు కుంగిన 20వ పిల్లర్ తోపాటు18, 19, 21వ పిల్లర్లను కేంద్రం బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. పగుళ్లు వచ్చిన డ్యాం, క్రస్ట్ గేట్లను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు.. బ్యారేజీ డిజైన్, నిర్మాణం వివరాలను రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల నుండి వివరాలు రికార్డు చేసుకున్నారు. బ్యారేజీ పటిష్టత, జరిగిన నష్టంపై కేంద్ర బృందం అంచనా వేసింది. కేంద్రం బృందం ఇచ్చే నివేదిక కూడా కీలకం కానుంది. డిజైన్ లోపం లేదా.. నిర్మాణ లోపం ఉంటే కేంద్ర బృందం ఆ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. విద్రోహ చర్య అయితే.. ఆ విషయాన్ని కూడా కేంద్ర బృందం వెల్లడించే అవకాశం ఉంది. ఒక వేళ కేంద్ర బృందం… నాణ్యతాలోపం లేదా డిజైన్ లోపం వల్ల అనే నివేదిక ఇస్తే.. ప్రభుత్వం.. తమ తప్పును ఇతరులపై నెట్టడానికి విద్రోహచర్య అనే ప్రచారం చేస్తున్నదన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.





