కొందరికి ఈ ఎన్నికలు ప్రత్యేకం

 ‌తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించారు. మొదటి సారి 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో…చేవెళ్ల నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత 2004లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. రాజశేఖర్‌ ‌రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌కు తొలి మహిళా హోం శాఖ మంత్రిగా పని చేశారు. అంతకు ముందు ఆమె భర్త ఇంద్రారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హోంశాఖ మంత్రిగా పని చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ హోంమత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో రెండు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి…కాంగ్రెస్‌ ‌తరపున గెలుపొందారు. వైఎస్‌ ‌కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో పోటీ దూరంగా ఉన్న ఆమె…2018లో గెలుపొందిన తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే…ఐదోసారి గెలుచినట్లవుతుంది.

ఏటికి ఎదురీదిన వారిలో శ్రీధర్‌ ‌బాబు ముందు వరుసలో ఉంటారు. 1999 ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గాలి వీచింది. మంథనిలో మాత్రం శ్రీధర్‌ ‌బాబు గెలుపొందారు. మాజీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, ఆరోసారి కాంగ్రెస్‌ ‌తరపున పోటీ చేస్తున్నారు. 1999, 2004, 2009, 2018 వరుస ఎన్నికల్లో గెలుపొందారు. ఒక్క 2014లో మాత్రమే శ్రీధర్‌ ‌బాబు ఓటమి పాలయ్యారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు చేతిలో పరాజయం పొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో పుట్ట మధుపై శ్రీధర్‌ ‌బాబు గెలుపొందారు. 2009 లో గెలిచిన శ్రీధర్‌ ‌బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో  స్పీకర్‌గా పనిచేశారు. స్పీకర్‌ ‌పదవికే వన్నె తెచ్చారు శ్రీపాదరావు.


image.png

తెలంగాణలో కొందరు నేతలు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పలువురు సీనియర్లు ఆయా నియోజకవర్గాల్లో వరుసగా గెలుస్తూ ప్రజల్లో పట్టు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచినా వారిని విజయాలే వరించాయి. రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టాలని రాజకీయ నేతలందరికీ ఉంటుంది. కొందరు నేతలు ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకముద్ర వేసుకున్నారు. పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా వారిని విజయాలే వరిస్తున్నాయి. ప్రతికూల రాజకీయ పరిస్థితులకు ఎదురొడ్డి ప్రజల నాడిని పట్టుకోవడంలో సక్సెస్‌ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎదురులేదని నిరూపించుకుంటున్నారు.  మంత్రులు తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌మాజీ మంత్రి దానం నాగేందర్‌, అక్బరుద్దన్‌ ఓవైసీ గ్రేటర్‌ ‌రాజకీయాల్లో వీరంతా ప్రత్యేక గుర్తింపు సంపాదిం చుకున్నారు. ఏటికి ఎదురీదిన వారిలో శ్రీధర్‌ ‌బాబు ముందు వరుసలో ఉంటారు. 1999 ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గాలి వీచింది. మంథనిలో మాత్రం శ్రీధర్‌ ‌బాబు గెలుపొందారు. మాజీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, ఆరోసారి కాంగ్రెస్‌ ‌తరపున పోటీ చేస్తున్నారు. 1999, 2004, 2009, 2018 వరుస ఎన్నికల్లో గెలుపొందారు. ఒక్క 2014లో మాత్రమే శ్రీధర్‌ ‌బాబు ఓటమి పాలయ్యారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు చేతిలో పరాజయం పొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో పుట్ట మధుపై శ్రీధర్‌ ‌బాబు గెలుపొందారు. 2009 లో గెలిచిన శ్రీధర్‌ ‌బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో  స్పీకర్‌గా పనిచేశారు. స్పీకర్‌ ‌పదవికే వన్నె తెచ్చారు శ్రీపాదరావు. అలాగే తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించారు. మొదటి సారి 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో…చేవెళ్ల నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొం దారు. ఆ తర్వాత 2004లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. రాజశేఖర్‌ ‌రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌కు తొలి మహిళా హోం శాఖ మంత్రిగా పని చేశారు. అంతకు ముందు ఆమె భర్త ఇంద్రారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హోంశాఖ మంత్రిగా పని చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ హోంమత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో రెండు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందారు. 2009లో మహేశ్వరం నియోజ కవర్గం నుంచి బరిలోకి దిగి…కాంగ్రెస్‌ ‌తరపున గెలుపొం దారు. వైఎస్‌ ‌కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో పోటీ దూరంగా ఉన్న ఆమె…2018లో గెలుపొందిన తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు.

ఈ ఎన్నికల్లో గెలిస్తే…ఐదోసారి గెలుచినట్లవుతుంది. మల్కాజ్‌గిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు… ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని రామాయంపేట నుంచి 2008 ఉప ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో తెలుగుదేశం అభ్యర్థిగా మెదక్‌ ‌స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017లో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్‌ ‌తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.  రాజేంద్రనగర్‌ ‌నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలుపొందారు టి.ప్రకాశ్‌గౌడ్‌. 2009, 2014‌లో తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించిన ప్రకాశ్‌గౌడ్‌…‌రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‌ఎస్‌ ‌తీర్థం పుచ్చుకున్నారు. 2018లో రాజేంద్రనగర్‌ ‌నుంచి గెలుపొంది హ్యాట్రిక్‌ ‌కొట్టారు. 2023లోనూ బరిలోకి దిగారు. పార్టీలు మారినా వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్‌ ‌కొట్టారు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. నాలుగోసారి గులాబీ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లోనూ అదే పార్టీ నుంచి గెలుపొందారు. రాష్ట్ర విభజనతో బీఆర్‌ఎస్‌లో చేరారు. గత శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం నుంచి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌సనత్‌నగర్‌ ‌నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఐదుసార్లు గెలుపొందిన తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ఆరోసారి గెలుపు కోసం బీఆర్‌ఎస్‌ ‌తరపున బరిలోకి దిగారు.
ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలెట్టారు. ఐదుసార్లు శాసనసభకు వేర్వేరు పార్టీల తరుపున ఎన్నికయ్యారు. 1986లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, 1994‌లో సికింద్రాబాద్‌ ‌నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో రెండోసారి గెలుపొంది చంద్రబాబు నాయుడు కేబినెట్‌ ‌లో మంత్రి అయ్యారు. 2004లో ఓడిపోయినా… 2008 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. మళ్లీ 2009లో ఓటమి పాలయ్యారు. 2014లో సికింద్రాబాద్‌ ‌నుంచి సనత్‌నగర్‌కు మారారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. కేసీఆర్‌ ‌కేబినెట్‌ ‌లో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. సనత్‌ ‌నగర్‌ ‌నుంచి హ్యాట్రిక్‌ ‌కొట్టాలన్న లక్ష్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌ ‌జాతీయ అధికార ప్రతినిధి పవన్‌ ‌ఖేరా సతీమణి కోట నీలిమ కాంగ్రెస్‌ ‌తరపున పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె జర్నలిస్టుగా పని చేశారు. కోట నీలిమ సీనియర్‌ ‌నేత తలసానిని ఢీ కొట్టబోతున్నారు. మాజీ మంత్రి దానం నాగేందర్‌ ‌పేరు హైదరాబాద్‌ ‌రాజకీయాల్లో అందరికి సుపరిచితమే. ఆరోసారి అసెంబ్లీ మెట్లు ఎక్కడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. 2018 ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఖైరతాబాద్‌ ‌నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఇప్పటి వరకు ఆయన ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఆసిఫ్‌నగర్‌ ‌నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీల నుంచి 1994, 1999, 2004లో శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2009, 2018లో ఖైరతాబాద్‌ ‌నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో ఖైరతాబాద్‌లో,  అంత కుముందు ఆసిఫ్‌నగర్‌లో పరాజయాలు ఎదురయ్యాయి. మరోసారి విజయం కోసం గట్టిగానే తలపడుతున్నారు. 2004 టికెట్‌ ‌దక్కకపోవడంతో టీడీపీ తరపున పోటీ చేసిన దానం విజయం సాధించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదే స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌ ‌రెడ్డి బాధ్యతలు చేపట్టడంలో కాంగ్రెస్‌ ‌లో చేరారు. 2009 ఎన్నికల్లో గెలుపొంది వైఎస్‌ ‌మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ 1999 నుంచి వరసగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి గెలిస్తే  అరుదైన డబుల్‌ ‌హ్యాట్రిక్‌ ‌రికార్డు ఆయన పేరున ఉంటుంది. నగరంలో ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ తరుఫున ఇన్ని పర్యాయాలు ఇప్పటి వరకు ఎవరూ వరుసగా గెలవలేదు.
– ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *