ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్ కు ఇటీవల మదర్ తెరెసా స్మారక అవార్డు-2023 వచ్చినందున పాతబస్తీ ముదిరాజ్ సంఘం, సహకార సంఘం ఆధ్వర్యంలో శ్యామ్ రావును శాలువా పూలమాలతో సంఘ సేవకులు, యువకులు, ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. గత 20 సంవత్సరాలుగా జిహెచ్ఎంసి నిధులతో ఎన్నో అభివృద్ది పనులు అమలు చేసి స్ట్రీట్ లైట్స్, రోడ్లు, స్మశాన వాటిక అభివృద్ధి తదితర పనులను పూర్తిచేసి అందరి మన్నలను పొందారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ శుభాకాంక్షలు తెలిపారు.




