‘‌కాళేశ్వరం’పై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ

తదుపరి విచారణ 27కు వాయిదా

న్యూ దిల్లీ, జూలై 22 : కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీమ్‌ ‌కోర్టు  విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై కోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు..సుప్రీమ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. దాఖలైన ఆరు పిటిషన్లు కలిపి ఒకేసారి విచారిస్తామని సుప్రీమ్‌ ‌కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *