హిమాయత్నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇఎస్ఐసి మాజీ మేనేజర్ కాలుసాని జోజిరెడ్డి, పుష్పల కుమారుడు వినయ్ కుమార్ రెడ్డి దివ్యల వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్, మిరుదొడ్డి నారాయణ, కాంగ్రెస్ నాయకులు, కాశిమోని శామ్ రావు ముదిరాజ్, వై.ప్రసన్న, సునీల్ రెడ్డి, ఆశ సౌమ్య, విజయ కుమార్ రెడ్డి, జి.స్వప్న, సుదీర్ రెడ్డి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జాయిదా బేగం షేక్, కమలమ్మ ప్రముఖ విద్యావేత్తలు, సంఘ సేవకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇఎస్ఐసి ఉద్యోగులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా టిసిసి కార్యదర్శి జోజిరెడ్డి కుమారుని వివాహం



