ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : మున్సిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నాణ్యతగా చేపట్టాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ అన్నారు. శనివారం 5వ వార్డ్ లో సిసి రోడ్డు పనులను చైర్మన్ రాంపాల్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జ్యోతి గోరేటి నరసింహ, చెక్కుల లక్ష్మణ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండే సాయి, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


