ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 : జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఆమనగల్లు మండల పరిధిలోని మెడిగడ్డ తండాలో ఎంపీపీ అనిత విజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకులు రాంజ్యా నాయక్, మల్లేష్ నాయక్, కిషన్ నాయక్, శ్యామ్, సురేష్ నాయక్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
మేడిగడ్డలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం





