– పోలీసుల ‘క్యూఆర్ కోడ్’ బ్యాండ్లు రెడీ
– చిన్నారులు, దివ్యాంగుల కోసం ‘సీటీ ఎంఎస్’ రిస్ట్ బ్యాండ్లు
– ఆవిష్కరించిన డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరలో భక్తుల వెంట వచ్చే చిన్న పిల్లలు, దివ్యాంగులు ఒకవేళ తప్పిపోతే వారి ఆచూకీని తక్షణమే కనిపెట్టి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ‘చి ల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ (సిటిఎంఎస్) రిస్ట్ బ్యాండ్లు అద్భుతంగా పనిచేస్తాయని పోలీసు డైరెక్టర్ జనరల్ బి.శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తన కార్యాలయంలో శనివారం




