తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు, టి.జె.ఎస్ అధ్యక్షులు ప్రొ.కోదండరాం కు ‘‘ఆత్మీయ పౌర సన్మానం’’ ఘనంగా జరిగింది. లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి భారీ ర్యాలీగా, అడుగడుగునా తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలతో కూడిన కళాకారుల ప్రదర్శనలతో వివిధ సంఘాల ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు, ముషీరాబాద్ జెఏసీ, తెలంగాణ జన సమితి హైదరాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, స్వాగతాలతో త్యాగరాయ గాన సభకు చేరుకున్నారు.. వేలాది అభిమానులు, కార్యకర్తలు మధ్య టి.జె.ఎస్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నాయకులు ఘనంగా సన్మానించారు.
ప్రొ.కోదండరాం,ఎమ్మెల్సీ కు ‘‘ఆత్మీయ పౌర సన్మానం’’





