జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 19: జగదేవపూర్ కేంద్రంలోని మార్కండేయ ఫంక్షన్ హల్ లో పద్మశాలి నూతన కార్యవర్గ సంఘం కార్యవర్గం సమావేశం నిర్వహించారు. పద్మశాలి నూతన మండల సభ్యునిగా ఎర్రగుంట వేణుగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉప అధ్యక్షుడుగా మహేశుని యాదగిరి ఎన్నికైన్నారు. కార్యదర్శి దండే యాదగిరి, కోశాధికారి దండే వేణు, సహాయ కార్యదర్శి మంత్రి బాలరాజు, ప్రచార కార్యదర్శిగా శంకరయ్య లను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..నూతనoగా బాధ్యతలు చేపట్టి నాపైన నమ్మకం పెట్టి సంఘానికి మంచి పేరు ప్రాక్యత లు మంచి గుర్తింపు సంఘానికి తీసుకొస్తాననిపేద పద్మశాలి లకు మంచి అవకాశాలు లభించేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో కన్వీనర్ పేర్ల సత్తయ్య, మాజీ అధ్యక్షుడు పేర్ల లక్ష్మి నారాయణ, కార్యవర్గ సభ్యులు దండే కిష్టయ్య, బడేంగుల నారా వేణు పద్మశాలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



