నిజామాబాద్‌ జిల్లా యువకుడి బరితెగింపు

  • స్కానింగ్‌కు వొచ్చే మహిళలపై వికృత చేష్టలు
  • న్యూడ్‌ ఫోటోలతో ఆపరేటర్‌ బెదిరింపు
  • మాట వినకుంటే సోషల్‌ మీడియాలోకి ఫోటోలు
  • బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు
  • రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు

నిజామాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : నిజామాబాద్‌ జిల్లా అయ్యప్ప స్కానింగ్‌ సెంటర్‌ ఆపరేటర్‌ బరి తెగించారు. స్కానింగ్‌ సెంటర్‌కు వొచ్చే మహిళలపై వికృత చేష్టలు చేయడం మొదలు పెట్టాడు. మహిళలు, యువతుల న్యుడ్‌ ఫోటోలు, వీడియోలను వారికి తెలియకుండా చిత్రీకరించేవాడు. అతని కామాన్ని పసిగట్టలేని మహిళలు, యువతులు స్కానింగ్‌ చేస్తున్నాడు అనుకునేవారు. డాక్టర్‌ స్కానింగ్‌ రాసాడు.. స్కానింగ్‌ సెంటర్‌కు వెళ్లామా.. తీసుకున్నామా.. వైద్యుడి దగ్గర చెకప్‌ చేయించుకుని మందులు తీసుకుందామా..అనే అలోచనలోనే ఉంటారు. అలాంటి వారిని టార్గెట్‌ చేసి, స్కానింగ్‌ సెంటర్‌ ఆపరేటర్‌ తన వికృత బుద్దిని చూపించుకున్నాడు. యువతుల, మహిళల న్యూడ్‌ ఫోటోలు తీసి వారికి చూపించడం మొదలు పెట్టాడు. దీంతో భయంతో మహిళలు అతని వద్దకు వెళ్లేవారిపై తన కామాన్ని తీర్చుకునేవాడు. అలా కొద్దిరోజులుగా తన వ్యవహారం కొనసాగించాడు.

తన మాట వినకుంటే వారి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా పెట్టి ఇంకా వీడియోలు కూడా వున్నాయంటూ బెదిరించేవాడు. అయితే ఓ మహిళ ఫోన్‌కు  ఇతని వద్దనుంచి ఫోన్‌ కాల్‌ వొచ్చింది. నీ ఫోన్‌ చెక్‌ చేస్కో అంటూ మాట్లాడాడు. తన ఫోన్‌ చెక్‌ చేసుకున్న మహిళ షాక్‌కు గురైంది. తన న్యూడ్‌ ఫోటోలు రావడంతో భయాందోళనకు గురైంది. అయితే మళ్లీ స్కానింగ్‌ సెంటర్‌ ఆపరేటర్‌ నుంచి కాల్‌ వొచ్చి ఆమెను తను చెప్పినట్లు చేయాలని బెదిరించాడు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదని, చెప్తే వీడియోలు కూడా బయట పెడతానని చెప్పాడు. అయితే బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఫోటోలు వైరల్‌గా మారడంతో న్యూడ్‌ ఫోటోల చిత్రీకరణపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్కానింగ్‌ సెంటర్‌కు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం నిజామాబాద్‌లో చర్చకు దారితీసింది. దీంతో స్కానింగ్‌ సెంటర్లకు వెళ్లాలంటే మహిళలు, యువతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *