‘ధరణి’ కొందరికి భరణం..మరికొందరికి ఆభరణం

అధ్యయనం కోసం కమిటీ వేశాం
మూడు జోన్లుగా రాష్ట్రం అభివృద్ధి
బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : గత ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’పై బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ధరణి కొందరికి భరణం..మరికొందరికి ఆభరణం కాగా చాలా మందికి భారమన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడిరచారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు చేపడతామని..ధరణి పోర్టల్‌ సమస్యల అధ్యయనానికి కమిటీ వేశామని గుర్తుచేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల అర్బన్‌ జోన్‌గా, ఓఆర్‌ఆర్‌ ` ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య పెరి అర్బన్‌ జోన్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ అవతలి ప్రాంతాన్ని గ్రావిూణ జోన్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్‌ భగీరథ కోసం రూ.35,752 కోట్లు ఖర్చు చేసినట్లు గత ప్రభుత్వం చెప్పిందని..వేల కోట్లు ఖర్చు చేసినా నేటికీ సురక్షిత నీరు లేని గ్రామాలెన్నో ఉన్నాయన్నారు. ఈ పథకం లోపాల దిద్దుబాటుకు చర్యలు చేపడతామని తెలిపారు.

గ్రావిూణాభివృద్ధిలో పదేళ్లలో చోటుచేసుకున్న తప్పులను సరిదిద్దుతామని, స్థానిక సంస్థలకు హక్కులను తిరిగి అందిస్తామని తెలిపారు. త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. గత ప్రభుత్వ ‘రైతుబంధు’తో అనర్హులే ఎక్కువగా లాభం పొందారని, వీటి నిబంధనలను పునఃసవిూక్ష చేస్తామని అన్నారు. నీటి పారుదల రంగంలో తప్పిదాలు ప్రగతికి అవరోధాలుగా మారాయని, నిపుణుల సలహాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం..శాపంగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణకు కార్యాచరణ ప్రకటించామని భట్టి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *