జిన్నారం మండలంలో భిఆర్ఎస్ పార్టీ గడపగడపకు ప్రచారం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 31: బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మద్దతుగా జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్,వెంకటేశం గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ,గూడెం మధుసూదన్ రెడ్డి  సతీమణి కల్పన, యువ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి,గూడెం సంతోష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కలిసి జిన్నారం మండలం మాదారం, నల్తూర్ లక్ష్మీపతి గూడెం, కొడకంచి  గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.పటాన్ చెరు ప్రగతిరథ సాధకుడు ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో గత పది సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించారు.వారితో పాటు సర్పంచులు,ఎంపీటీసీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *