జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప మధిర గ్రామం గోపాల్ పూర్ ను నూతన గ్రామపంచాయతీగా చేయాలని సోమవారం రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి ఎంపీటీసీ కిరణ్ గౌడ్, గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి గోపాల్ పూర్ ను నూతన గ్రామపంచాయతీగా ఏర్పడే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు చందు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



