ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 11 : ఆమనగల్లు మున్సిపాలిటీలో త్వరలో రానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్ఞన కార్యక్రమాల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్, ఎస్సై బలరాం లతో కలిసి పరిశీలించారు. సురసముద్రం చెరువులో గణేష్ నిమజ్జనం ఎర్పట్లు ఏ విధంగా చేయాలి తదితర విషయాలపై చర్చించారు.



