యాదగిరిగుట్ట ఆలయ ఈవో రాజీనామా

– వ్య‌క్తిగ‌త కార‌ణాలతోనే..

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 1: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్య‌నిర్వ‌హ‌ణాధికారి(ఈవో) వెంకట్రావు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రభుత్వానికి తెల‌ప‌డంతో రాజీనామాకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింద‌ని తెలిపారు. స్వామి వారి ఆలయం మున్ముందు అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలని, అందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని  కోరుతున్నానని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *