పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్త వహించాలి

– నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంత రావు గురువారం పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్‌ డెస్క్‌, వీడియోగ్రఫీ, పోలీస్‌ బందోబస్తు తదితర అంశాలను పరిశీలిస్తూ సపోర్టింగ్‌ స్టాఫ్‌ సరిపడ ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్‌ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్‌లను ఏ రోజుకారోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలన్నారు. ప్రతి నామినేషన్‌ సెంటర్‌ వద్ద హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా పై అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *