దళితుల భూమిని దౌర్జన్యంగా లాక్కుంటారా?

-దుందిభి నదిలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల ఇసుక దోపిడీ
-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

నాగర్‌ ‌కర్నూల్‌, ‌ప్రజాపతంత్ర,డిసెంబరు27:మెడికల్‌ ‌కాలేజీకి 40 ఎకరాల దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌డ్‌ ‌కల్చర్‌ని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకువచ్చారని ఆక్షేపించారు. దుందిభి నదిలో బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతలు పోటాపోటీగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈమేరకు  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై  కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిది డైవర్షన్‌, ‌కరప్షన్‌ ‌పాలన అని విమర్శలు చేశారు. శనివారం నాగర్‌ ‌కర్నూలు జిల్లాలోజాగృతి జనం బాటలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టకి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కవిత. అభివృద్ధి అవకాశాలు అందరికీ సమానంగా రావాలని సూచించారు. సామాజిక తెలంగాణ సాధనకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ‌హయాంలో కాళేశ్వరాన్ని పరుగులు పెట్టించినట్లుగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. నల్ల మట్టి తీసేందుకు రైతుల వద్ద తీసుకున్న900 ఎకరాల భూమిని వారికి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. పదేళ్లలో డిండి ప్రాజెక్ట్‌కి నీటిని తరలించలేదని.. ప్రభుత్వం మారిన కూడా ఇంకా సర్వేలే జరుగుతున్నాయని కవిత విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *