ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే గడిపేస్తు న్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్న రోజులివీ. స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీ తంగా పెరిగిపోవడం, ఇంట ర్నెట్ ఛార్జీలు అందుబాటులోకి రావడంతో ప్రతీ ఒక్కరూ సో షల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు.స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది పోస్ట్ చేయకూడదని టెక్ నిపుణులు చెబుతు న్నారు. సోషల్ మీడియా కొన్ని సంవత్సరాలుగా విస్తరించింది.యువతరానికి వార్తల వనరుగా ప్రజలను అనుసంధానించే డిజిటల్ ఫోరమ్ నుండి పరిణామం చెందింది.
పిల్లలు మొదులుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు వారి సెల్ ఫోన్ల ద్వారానే ప్రపంచంలో జరిగే ఎటువంటి విషయాలను తెలుసుకుంటున్నారు.అందులో మంచివి ఉన్నాయి.చెడ్డవి ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ లలో వివిధ రకాల యాప్ ల ద్వారా సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.సోషల్ మీడియా ఒక కీలకమైన శక్తిగా నిలుస్తుంది. ఇది మనం ఎలా కమ్యూనికేట్ చేస్తామో,దీంతో ఎలా పని చేస్తామో మరియు కనెక్ట్ అవుతామో మనకు తెలి యదు. మనకు తెలియకుండానే దానికి కనెక్ట్ అవు తాం. విద్యార్థులు, యువత,పెద్దలు, ఉద్యోగులు, ఎక్కువగా ఉపయోగించే వాట్సాప్, ఫేస్ బుక్,ఎక్స్, ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్, స్కైప్ వంటి వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.అయితేప్రస్ తుత కాలంలో సోషల్ మీడియా వాడకం వల్ల సైబర్ స్టాకింగ్, సైబర్ బెదిరింపు, ట్రోలింగ్ వంటి వాటికి గురికావచ్చు.ఇది ఒత్తిడి,ఆందోళన మరియు నిరాశకు దారితీస్తుంది.
సోషల్ మీడియాలో కొత్త వార్తలు,కంటెంట్, ఆన్లైన్ గేమ్లు,ఉత్సాహం మరియు వినోదంతో పిల్లలని వ్యస నపరుస్తున్నది. నిరంతరం ఎక్కువగా ఉపయోగించడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అవసరం ఉన్నా లేకున్నా ప్రస్తుతం సమాజంలోని వ్యక్తులు తరచుగా సోషల్ మీడియా సైట్లను నిరంతరం తనిఖీ చేసి, వివిధ రకాల వీడియోలను కంటెంట్లను చూడడం, చదవడం జరుగుతుంది.మీరు ఆన్లైన్లో లేకపోతే ఏదైనా మిస్ అవుతారనే ఆలోచన మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.సోషల్ మీడియా అనేది ప్రజలు వ్యక్తిగత చిత్రాలు మరియు సమాచారాన్ని పంచుకునే వేదికగా మారింది.ప్రజల ఆమోదం మరియు ప్రశంసలను కోరుకుంటుంది, ఇది స్వీయ-ఇమేజ్ సమస్యలకు దారితీస్తుంది.ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్లు మన దైనందిన జీవితాల్లో సజావుగా కలిసిపోయాయి.కేవలం సాధ నాల కంటే ఎక్కువగా మారాయి.అవి ఇప్పుడు మన ప్రపంచ సంస్కృతికి కేంద్రం గా ఉన్నాయి.వాటిని విస్తృతంగా ఉపయో గించడం జరుగుతుంది.సోషల్ మీడియా బ్రాండ్ అవగాహనను పెంచుతుంది మరి యు మీ వెబ్సైట్కు మరింత ఆకర్షిస్తుంది.
ఉదాహరణకు, మీ వెబ్సైట్లో ఉంచబడిన ట్యుటోరియల్స్, వీడియోలు, బ్లాగ్ పోస్ట్లు లేదా ఇతర మాధ్యమాలను షేర్ చేయడం వల్ల ఈ పోస్ట్లు మరింత ఎక్స్పోజర్ పొందడానికి సహాయపడతాయి. సోషల్ మీడియా కంపెనీ పనితీరును విశ్లేషించి, ఉత్పాదకతను ఎలా మెరుగుపరచాలో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ యొక్క నాటకీయ పెరుగుదల సోషల్ మీడియా ప్రభావాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.ప్రపంచవ్యాప్తంగా 4.2 బిలియన్ల క్రియాశీల వినియోగదారులతో, ఇది ఇప్పుడు మన దైనందిన జీవితంలో ఒక భాగమైంది. నిద్ర సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, మానసిక కల్లోలం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.నిరాశ, ఒంటరితనం, స్వీయ- హాని, ఆత్మహత్య ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంది.జీవితం లేదా ప్రదర్శన గురించి అసమర్థత వంటి ప్రతికూల అనుభవాలు వచ్చే ప్రమాదం ఉంది. సైబర్ బెదిరింపులు సైబర్ బెదిరింపులకు గురయ్యే ప్రమాదం ఉంది.గోప్యతా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.తప్పుడు సమాచారం త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. 2000ల మధ్యలో ఫేస్బుక్, యూట్యూబ్ మరియు ట్విట్టర్ల పరిచయం నుండి 2010 ల మధ్యలో ఇన్స్టాగ్రామ్,స్నాప్చాట్ మరియు టిక్టాక్లను ప్రవేశపెట్టిన రెండవ దశ ప్లాట్ఫారమ్ల వరకు, సోషల్ మీడియా ప్రతిచోటా ఉంది.
రాజకీ యాలను గణనీయంగా ప్రభావితం చేసింది.ఈ రోజుల్లో, చాలా మంది ప్రజలు వాటి ద్వారానే వార్తలను పొందుతున్నారు.కొన్నిసార్లు సాంప్రదాయ మాధ్యమాల కంటే ముందే రాజకీయ మరియు ఇతర వార్తలను యాక్సెస్ చేయడానికి ఈ మాధ్యమం సులభమైన మార్గం.పల్లెల నుంచి పట్టణాల వరకు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్న రోజులివీ. స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, ఇంటర్నెట్ ఛార్జీలు అందుబాటులోకి రావడంతో ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు.ఏం తిన్నారు, ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారు.? ఇలా ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా చెప్పుకు ంటూ పోతే ఎన్నో సోషల్ మీడియా సైట్స్లో తమ అప్డేట్స్ను అప్డేట్ చేసేస్తున్నారు.
అయితే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది పోస్ట్ చేయకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దుష్ఫ్రభావాలు ఎదుర్కోక తప్పదని చెబుతున్నరు. ఇంతకీ సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడని అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.డీప్ఫేక్ వీడియోలు వంటి భయానక పరిస్థితులు ఉన్న ప్రస్తుత రోజుల్లో పర్సనల్ ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు. డీపీలుగా కూడా మీ వ్యక్తిగత ఫొటోలు పెట్టుకోకపోవడమే మంచిది. ఈ ఫొటోలను సేకరించి కొందరు ఫేక్ వీడియోలు తయారు చేసి, బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం ఉందని గుర్తించాలి.ఇక కొందరు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే దీనివల్ల మీరు ఇంట్లో లేరన్న విషయాన్ని దొంగలకు మీరే చెప్పినట్లు అవుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తిగత విషయాలను ఎప్పటికీ షేర్ చేసుకోకూడదు.
బ్యాంక్ అకౌంట్స్కు, ఇతర వ్యక్తిగత అవసరాలకు వాడుకునే ఈ-మెయిల్ ఐడీని ఎట్టి పరిస్థి తుల్లోనూ సోషల్ మీడియా సైట్స్లో షేర్ చేయకూ డదు. ఒకవేళ సోషల్ మీడియా అకౌంట్స్కు ఈమె యిల్ ఐడీ ఇవ్వాల్సి వస్తే.. మరో మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి.ఇక కొందరు సోషల్ మీడియాలో తమ ఫోన్ నెంబర్లను షేర్ చేసుకుంటుంటారు. అ యితే ఇలా వ్యక్తిగత ఫోన్ నెంబర్లను సోషల్ మీడి యాలో పోస్ట్ చేయడం ద్వారా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోన్ నెంబర్ను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు.
బ్యాంక్ అకౌంట్స్కు, ఇతర వ్యక్తిగత అవసరాలకు వాడుకునే ఈ-మెయిల్ ఐడీని ఎట్టి పరిస్థి తుల్లోనూ సోషల్ మీడియా సైట్స్లో షేర్ చేయకూ డదు. ఒకవేళ సోషల్ మీడియా అకౌంట్స్కు ఈమె యిల్ ఐడీ ఇవ్వాల్సి వస్తే.. మరో మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి.ఇక కొందరు సోషల్ మీడియాలో తమ ఫోన్ నెంబర్లను షేర్ చేసుకుంటుంటారు. అ యితే ఇలా వ్యక్తిగత ఫోన్ నెంబర్లను సోషల్ మీడి యాలో పోస్ట్ చేయడం ద్వారా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోన్ నెంబర్ను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు.
ఇక సోషల్ మీడియాలో మీ ఇంటి అడ్రస్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయ కూడదు. తెలిసో తెలియకో మీరు చేసే ఈ తప్పు వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.ఇక చిన్న పిల్లల ఫొటోలను సైతం వీలైనంత వరకు సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని నిపుణులు చెబుతు న్నారు. దీనివల్ల మీ పిల్లల భద్రతను మీరే ప్రమాద ంలోకి నెట్టేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేస్తున్న కంపెనీకి సంబంధించి మీ అబి •ప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేయ కూడదు. మరీ ముఖ్యంగా నెగిటివ్ అంశాలను ప్రస్తా విస్తూ పోస్టులు పెట్టకూడదు దీనివల్ల మీ కెరీర్పై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్నేహితులతో కలిసి గడిపిన పార్టీలకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. మరీ ముఖ్యం గా మీ వ్యక్తిగత పార్టీల ఫోటోలను అస్సలే పంచు కోకండి.
డా. మోటె చిరంజీవి
సీనియర్ అధ్యాపకులు, సామాజిక వేత్త, విశ్లేషకులు
9949194327





