హాస్టళ్లపై యుద్ధం ప్ర‌భావం

‌- గ్యాస్‌ ‌సరఫరా లేక‌ త‌గ్గిన ఫుడ్ ఐట‌మ్స్‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 11:  మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ ప్రభావం హైదరాబాద్‌లోని హాస్టల్స్‌పై పడింది. ఇరాన్‌- ఇ‌జ్రాయెల్‌ ఉ‌ద్రిక్తతల మధ్య గ్యాస్‌ ‌సంక్షోభం వాటిల్లిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత హాస్టల్స్‌కు గ్యాస్‌ ‌సరఫరా తగ్గింది. ఐటీ కారిడార్‌లో గ్యాస్‌ ‌సరఫరా తగ్గడంతో ఫుడ్‌ ఐటమ్స్ ‌తగ్గించారు. కమర్షియల్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా నిలవడంతో హాస్టల్‌ ‌యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి.. ఈ అంశంపై హాస్టల్‌ అసోసియేషన్‌ ‌ప్రతినిధులు స్పందించారు. కమర్షియల్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా నిలిచిందని.. కావల్సినంత గ్యాస్‌ ‌సరఫరా లేదన్నారు.. ప్రస్తుతం నగరంలో పదకొండు వేల హాస్టల్స్ ఉన్నాయని.. లక్షల మంది హాస్టల్స్‌లో ఉన్నారన్నారు.. ఎడ్యుకేషన్‌, హాస్పిటల్‌కు సంబంధించిన హాస్టల్స్‌కు గ్యాస్‌ ‌సరఫరా చేస్తున్నారని చెప్పారు.. ‘కమర్షియల్‌ ‌గ్యాస్‌ ఇవ్వకుంటే.. డొమెస్టిక్‌ ‌గ్యాస్‌ ‌రోజుకి ఒకటై ఇవ్వాలని కోరారు.. అధికారులతో మాట్లాడాం.. రెస్పాన్స్ ‌లేదు.. గ్యాస్‌ ఎక్కువగా వినియోగ‌మ‌య్యే ఫుడ్‌ ఐటమ్స్ ‌తగ్గిస్తున్నాం.. చపాతి దోశ వంటి ఐటమ్స్ ‌తగ్గిస్తామని చెప్పాం.. హాస్టల్స్ ‌మూసేసే పరిస్థితి రాదని అనుకుంటున్నాం..‘ అని హాస్టల్‌ ‌యాజమాన్యాలు వెల్లడించాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *