– మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– పార్టీ గెలుపు కోసం కృషి చేసిన అందరికీ అభినందనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థిని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, కష్టించి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగడం.. ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్కు తెలియదన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాడటం.. అధికారంలో ఉంటే సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసునన్నారు. అందుకే ప్రజల్లో కాంగ్రెస్పై ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని తెలిపారు. తమ రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా గమనించి తీర్పునిచ్చారన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందంటూ మన పాత్రలను, వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికలో ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారంటూ పోలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్కు, 38 శాతం బీఆర్ఎస్కు, 8 శాతం బీజేపీకి వచ్చాయన్నారు. ఇది బాధ్యతగా భావించి నగరాన్ని విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని సీఎం చెప్పారు. మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ పునరుజ్జీవం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, గోదావరి జలాల తరలింపు వంటి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో ఫే˜క్ ప్రచారాలతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం చిమ్మిందని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షంగా అభివృద్ధికి సహకరించకపోగా ప్రతీ సందర్భంలో అవహేళన చేసే ప్రయత్నం చేసిందన్నారు. హైడ్రా, మూసీ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రానీయకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో కిషన్ రెడ్డి తానే అభ్యర్థిగా మారి పనిచేస్తే 17 వేల ఓట్లు వచ్చాయంటూ ఈ ఫలితాల తరువాతైనా ఆయన తన వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు. ఇది భూకంపం వచ్చే ముందు వచ్చే అలర్ట్ లాంటిదన్నారు. ఈ ఫలితాలు విశ్లేషించుకుని రాష్రాభివృద్ధికి సహకరించండి కిషన్ రెడ్డిగారూ.. సచివాలయానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నా.. కేంద్రం వద్ద పెండిరగ్ అనుమతులు, నిధులపై చర్చిద్దాం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండిరగ్ అనుమతులు, నిధులకు సంబంధించి సమీక్ష పెట్టి నివేదిక రూపంలో ఎంపీలకు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రికి సూచన చేస్తున్నానన్నారు. హరీష్ రావు, కేటీఆర్లకు ఈ వేదికగా సూచన చేస్తున్నా హరీష్ గారూ.. మీ అసూయను తగ్గించుకోండి.. కేటీఆర్.. మీ అహంకారాన్ని తగ్గించుకోండి.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు. 65 అసెంబ్లీ స్థానాల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు కచ్చితమైన మెజారిటీ ఇచ్చారు.. జూబ్లీహిల్స్లో 51 శాతం ఓట్లతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు అని ముఖ్యమంత్రి చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీ ఓట్లు కలిపినా అన్ని ఓట్లు రాలేదు. ప్రజలు మీ అసూయను, అహంకారాన్ని గమనిస్తున్నారు. మీ ఇద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఎలా ఆమోదిస్తారని మీరు భావిస్తున్నారని నిలదీశారు. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉంది.. రెండేళ్లు అభివృద్ధికి సహకరించండి.. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయండి.. సమస్యలు ఉంటే ప్రశ్నించండి, ధర్నాలు చేయండి.. మీ సోషల్ మీడియాలో మీరు చెప్పిందే రాస్తారు.. అదే నిజమని మీరు భ్రమల్లోకి వెళితే ఎలా అన్నారు. వ్యాపార దృక్పథంతో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తున్నాయన్నారు. కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తున్నా కొన్ని ఛానళ్లు బీఆర్ఎస్ హవా మొదలైందని వార్తలు వేశాయి.. దయచేసి మీ విశ్వసనీయత కోల్పోకండి.. మాపై మీకు వ్యతిరేకత ఉంటే ఇంకో రకంగా చూపించండి.. ఈ ఫలితాలపై విశ్లేషణ చేయండి.. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు 39.5 శాతం ఓట్లు వచ్చాయి.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు కాంగ్రెస్కు ఇచ్చారు.. ఇప్పుడు 51 శాతం ఓట్లు ప్రజలు ఇచ్చారు అని వివరించారు. కాంగ్రెస్ ఒక్క తాటిపై ఉన్నప్పుడు ఎవరి తాతలు దిగొచ్చినా ఓడిరచలేరు అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





