చెన్నారెడ్డి సేవలు ఎనలేనివి

– ముఖ్యమంత్రి రేవంత్‌ నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆయనకు హృదయపూర్వక నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డాక్టర్‌ చెన్నారెడ్డి చిత్రపటానికి ముఖ్యమంత్రి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి డాక్టర్‌ చెన్నారెడ్డి చేసిన కృషిని ప్రశంసించారు. ఆయన నిజమైన రాజనీతిజ్ఞుడని, సామాజిక న్యాయం, రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని కొనియాడారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని, వివిధ పరిపాలనా సంస్కరణలతో మార్గదర్శక శక్తిగా పనిచేశారని చెప్పారు. ఆయన వారసత్వం తెలంగాణ చరిత్రలో ఒక మూలస్తంభంగా మిగిలిపోయిందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *