ఒకే రోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య

– తెలంగాణ దుర్భర పరిస్థితులకు నిదర్శనం
– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌
‌-రైతులకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్యల‌కు పాల్ప‌డ్డారు. భూపాలపల్లి, మెదక్‌ ‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన కోడెల సదానందం (42) పోతులవాయి శివారులో తనకున్న నాలుగెకరాల్లో పత్తి సాగుచేశాడు. పెట్టుబడుల కోసం తెచ్చిన రూ.2 లక్షలకుపైగా అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య రమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కాటారం ఎస్సై శ్రీనివాస్‌ ‌తెలిపారు. మెదక్‌ ‌జిల్లా కౌడిపల్లి మండలం బతుకమ్మతండాకు చెందిన రైతు దేవ్‌సోత్‌ ‌సర్వేశ్‌ (57) ‌తనకున్న ఎకరం ఐదు గుంటల పొలంలో బోరు వేశాడు. ఇల్లు కట్టి, ఇద్దరు కుమారుల పెండ్లి చేయడానికి రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఈనెల 11న పెద్ద కొడుకు అనిల్‌కు ఫోన్‌ చేసి గడ్డిమందు తాగినట్టు చెప్పాడు. వెంటనే నర్సాపూర్‌ ‌ప్రభుత్వ దవాఖానకు, అక్కడినుంచి హైదరాబాద్‌లోని గాం ధీ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆదిలాబాద్‌ ‌జిల్లా బేల మండలం పిట్‌గావ్‌ ‌గ్రామానికి చెందిన రైతు జాదవ్‌ అం‌కుష్‌ (33) ‌తనకున్న మూడెకరాల్లో పత్తి, కంది సాగు చేశాడు. ఇందుకోసం అప్పులు తీసుకున్నాడు. మానసిక వేదనకు గురైన అంకుష్‌ ఈనెల 18న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం మృతిచెందాడు.

అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళనకరం

అన్నదాతల ఆత్మహత్యలు అత్యంత ఆందోళనకరమని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంనాటి సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలే నిదర్శనమన్నారు. ఆదిలాబాద్‌, ‌మెదక్‌, ‌జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాల్లో ముగ్గురు రైతుల నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిదే అని మండిపడ్డారు. భూపాలపల్లిలో కోడెల సదానందం, మెదక్‌లో దేవ్‌ ‌సోత్‌ ‌సర్వేశ్‌, ఆదిలాబాద్‌లో జాదవ్‌ అం‌కుష్‌ ‌కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల ఎక్స్ ‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం కావడం, రేవంత్‌ ‌సర్కారు మోసా, అబద్ధపు హామీల పేరిట చేసిన తీరని ద్రోహాన్ని అడుగడుగునా ఎత్తిచూపుతోందని అన్నారు. రుణ మాఫీ పేరిట చేసిన నయవంచనకు తోడు, పెట్టుబడి సాయానికి పాతరేయడం, చివరికి యూరియాను కూడా ఎగ్గొట్టి దిగుబడిని దెబ్బతీయడంతో కాంగ్రెస్‌ ‌పాలనలో అన్నదాత పరిస్థితి అనాథలా మారిందని అన్నారు. రెండేళ్ల కాలంలోనే దాదాపు 900 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినా ఈ సన్నాసి సర్కారుకు ఇప్పటికీ సోయి రాలేదని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. పదేళ్లు ధైర్యంగా బతికిన రైతు కుటుంబాల్లో ఇవాళ మోగుతున్న ఈ మరణమృదంగానికి రేవంత్‌ ‌సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అన్నదాతలారా.. దయచేసి ధైర్యం కోల్పోకండి. మరో మూడేళ్లు ఓపిక పట్టండని సూచించారు. ఈ వ్యవసాయ వ్యతిరేక కాంగ్రెస్‌ ‌పార్టీని, రైతు ద్రోహి రేవంత్‌ ‌ను గ్దదెదించుదామని.. వ్యవసాయరంగానికి మళ్లీ మంచి రోజులు తెచ్చుకుందామని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *