హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో బుధవారం ఉదయం జాతీయ పతాకాన్ని కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ్యులు శివడి ప్రవీణ(జ్యుడీషియల్), సభ్యులు డాక్టర్ బి.కిషోర్(నాన్ జ్యుడీషియల్), కార్యదర్శి అండ్ సీఈవో ఎ.ఎన్.కాంతి వెస్లీ పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ అధికా బీఏవి విజయ్, డిప్యూటీ రిజిస్ట్రార్-కమ్-చైర్పర్సన్ పి.ఎస్, పి.శ్రీనివాస్రావు, పీఆర్వో కవ్ ఏవో(ఎఫ్ఏసీ), శ్రీరాములు, డీఎస్పీ, అలాగే కోర్ట్ మాస్టర్లు, కోర్టు అధికారులు, సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. అనంతరం గౌరవ ఛైర్పర్సన్ రాష్ట్ర వేడుకలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




