– తిరుమలలో డిప్యూటీ సీఎం భట్టి
తిరుమల, జనవరి 1ః రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని తిరుమలేశుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం ఉదయం తిరుమల లో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దరి్శంచుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి.. తెలంగాణ రైజింగ్ లో, రాష్ట్రం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలి, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





