మద్యం దుకాణాలకు టెండర్లు.. దరఖాస్తు ఫీజు భారీగా పెంపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర : ‌తెలంగాణలో మద్యం దుకాణాల ఆశావాహులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల (Liquor Shop Tenders-) దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ బుధవారం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. అలాగే, దరఖాస్తుల ఫీజు కూడా భారీగా పెంచేసింది. దరఖాస్తు పీజు రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినట్లు పేర్కొంది. వొచ్చే రెండేండ్ల కాల పరిమితి 2025 డిసెంబర్‌ ‌నుంచి 27 నవంబర్‌ ‌వరకు సంబంధించి లాటరీ పద్దతి ద్వారా మద్యం దుకాణాల (Liquor Shops) లైసెన్సులను ఎంపిక చేయనుంది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించనుంది. మద్యం దుకాణాలకు 6 శ్లాబ్‌లలో ఎక్సైజ్‌శాఖ లైసెన్స్‌లు జారీ చేయనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *