మానసిక సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారం

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10: సమాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల సామర్థ్యం టెక్నాలజీకి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. సైబర్‌ హోప్‌ హెల్ప్‌ ఇనిషియేటివ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఏఐ ఆధారిత మెంటల్‌ హెల్త్‌ సపోర్ట్‌ సిస్టం ‘హోప్‌ ఐ’ను రాయదుర్గంలోని టీ-హబ్‌లో ఆయన బుధవారం లాంఛనంగా ఆవిష్కరించారు. ఇన్నోవేషన్‌ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఈ సందర్భంగా వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఆవిష్కరణలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఆ దిశగా దృష్టి సారించి ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవాలని యువ ఆవిష్కర్తలకు సూచించారు. కార్యక్రమంలో టీ-హబ్‌ సీఈవో కవికృత్‌, సైబర్‌ హోప్‌ హెల్ప్‌ ఇనిషియేటివ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *