– విమానాల రాకపోకలకు అంతరాయం
న్యూదిల్లీ, నవంబర్ 7: దేశ రాజధాని దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతికలోపం తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీని కారణంగా దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజుకు 1500లకు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఒకరు ఈ విషయాన్ని వెల్లడిరచారు. తాము ప్రయాణిస్తున్న విమానం రన్వేపై అరగంటకు పైగా నిలిచిపోయిందని, ఏటీసీ సిస్టమ్లో సమస్య వల్లే ఈ జాప్యం జరిగిందని సిబ్బంది తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ గ్లిచ్ కారణంగా విమానాల రాకపోకలు రెండిరటికీ కొంతసేపు అంతరాయం ఏర్పడిరది. దీంతో బోర్డింగ్ గేట్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. సాంకేతిక బృందాలు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, త్వరలోనే కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని ఎయిర్ ఇండియా సిబ్బంది ప్రయాణికులకు సర్దిచెప్పారు. ఆశ్చర్యకరంగా ఇదే విమానాశ్రయంలో ఇలాంటి సాంకేతిక సమస్య తలెత్తడం ఈ వారంలో ఇది రెండోసారి. కేవలం రెండు రోజుల క్రితం, బుధవారం నాడు కూడా ఇదే తరహాలో సమస్య తలెత్తగా, దాన్ని పరిష్కరించినట్లు, కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలతో ముందుకు సాగవచ్చని కూడా సూచించారు. బుధవారం నాటి సమస్యపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ.. థర్డ్-పార్టీ కనెక్టివిటీ నెట్వర్క్లో సమస్య కారణంగా కొన్ని ఎయిర్లైన్స్తో పాటు తమ చెక్-ఇన్ సిస్టమ్లు కూడా ప్రభావితమయ్యాయని, అందుకే విమానాలు ఆలస్యమయ్యాయని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపింది. సిస్టమ్ను పునరుద్ధరించామని, అయితే పరిస్థితి చక్కబడే వరకు కొన్ని విమానాలు ఆలస్యంగా నడవొచ్చని వివరించింది. అయితే, అంతా సర్దుకుందని ప్రకటించిన రెండు రోజులకే అదే తరహా సమస్య పునరావృతం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. తాజా ఘటనపై ఎయిర్లైన్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





