Tag తెలుగు వార్తలు

కాంగ్రెస్‌లో ‘ముఖ్యమంత్రి’లొల్లి

ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకుపేరు గోవింద అన్న నానుడిలా ఉందిప్పుడు కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి లొల్లి. గతంలో కాంగ్రెస్‌లో కార్యకర్తలుండరు అందరూ నాయకులే అన్నట్లు, ఇప్పుడు నాయకుల్లో కొందరు సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిమీదే అశ పెట్టుకున్నారు. క్రమేణ ముఖ్యమంత్రి అభ్యర్ధుల జాబితా పెరుగుతూ పోతోంది. అర్హతలు, అనుభవమన్న విషయాన్ని పక్కకు పెట్టి రెడ్డి వర్గమైతే…

శివ శక్తి స్వరూపమే దుర్గామాత

దుర్గాష్టమి సందర్భంగా సృష్టియందు గల చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీత మైన, అనిర్వచనీయ మైన, అవ్యక్త మైన, చైతన్య వంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి యందుగల జ్యోతిర్మండల, గాలి, నిప్పు , నీరు, భూమి ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది అందరూ…

DSC Application Deadline Extension

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రకారం ఈ…

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌…ఒక్కో కార్మికుడికి రూ. లక్షా 53 వేలు

రూ. 711 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు రూ. 700 కోట్లు బోనస్‌ ‌కింద విడుదల చేసింది. ఈ మొత్తం నుంచి ఒక్కో కార్మికుడికి రూ. లక్షా 53 వేల బోనస్‌ ఇవ్వనున్నట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న 42…

నిజాం చెక్కర ఫ్యాక్టరీ తెరిపిస్తాం : రాహుల్‌ ‌గాంధీ

తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బబ్బర్‌ ‌షేర్‌ ‌తెలంగాణ అని ఏఐసిసి అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం జగిత్యాల పర్యటనలో భాగంగా కార్నర్‌ ‌మీటింగ్‌లో మాట్లాడుతూ..‘సింహాలు సింగిల్‌గానే కాదు..గుంపులుగా కూడా వొస్తాయ్‌’ అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ ‌సింహాలు గర్జిస్తున్నాయ్‌..‌రాబోయేది బబ్బర్‌ ‌షేర్‌ ‌తెలంగాణా అన్నారు. ప్రజల తెలంగాణా కోసమే కాంగ్రెస్‌ ‌పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణాలో…

‌ప్రజలను ఆకట్టుకున్న రాహుల్‌ ‌దోశ వేయడం..చిన్నారులకు చాక్లెట్స్ ‌పంపిణీ

జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ గత మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం రాహుల్‌ ‌జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ‌విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గ మధ్యంలో న్యాక్‌ ‌స్టాప్‌ ‌వద్ద ఆగారు. ఈ సందర్భంగా…

మానవత్వం కోసం అన్వేషణ…

ఒక్కరోజుతోనే ముగిసిపోయే /  ఊరి జాతరలా ఎన్నికల పండగ… రాజకీయ గొంగట్లో/  విశీర్ణమౌతున్న విలువల గొంతుకలు/ ఎంత గుక్కపట్టి ఏడ్చినా /  రెక్కలు విదుల్చుకోలేక కునారిల్లుతున్నాయి అని వర్తమాన రాజకీయాల విచిత్రాలను ఓట్ల సంత కవితలో  డా.ఎన్‌. ఈశ్వరరెడ్డి విశ్లేషించారు. నాకొక మనిషి కావాలి అన్న శీర్షికన 43 కవితలతో ఆయన కవితా సంపుటి వెలువడింది.…

ఈ శతాబ్ది శతకం

కొన్ని ప్రవహించే మొహాలను చూశాను దేశాలను దాటుతూ నిరంతరాయంగా అవి కోరస్‌ ఆలపిస్తూ విషాద నాటకానికి తయారవుతున్నవి వాటి మాస్కులను ఏ యుద్ధబీజాలకో తగిలించి వ్యసనానికి సహనాన్ని నేర్పే పాత్రలకై విశ్వ గురుత్వ స్థిరాంకాలను ఏర్పరుస్తూ విఫలమైనవే.. అవి ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు జిగురు రంగు రక్తపు చారలుగా మరకల మడతలుగా హోర్డింగ్‌ చేయబడ్డవి ఇది ప్రకటన!…

రహస్య భేటీ సమాచారాన్ని ప్రధాని వెల్లడించవచ్చా ?

తెలంగాణలో ఇంత కాలంగా తనకు ఎదురు లేదనుకున్న అధికార బిఆర్‌ఎస్‌ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిరది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందనుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాంబు లాంటి వార్త పేల్చడంతో గుక్క తిప్పుకోకుండా అయింది బిఆర్‌ఎస్‌ పరిస్థితి. దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతుంటాయి. పార్టీల మధ్య కొన్నిసార్లు…