Tag Today Hilights

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై లుక్‌ఔట్‌ నోటీసులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబ్‌ 27 : బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీస్‌ జారీ చేశారు. సోహెల్‌ పంజాగుట్టలో రాష్‌ డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపొమ్మని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్‌ అబ్దుల్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పంపించాడు. ప్రమాదం చేసి నేరుగా ముంబైకి…

ప్రజల వద్దకే పాలన…

ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు…అవసరమైన వారికి అందజేస్తాం మేడిగడ్డపై విచారణ కొనసాగుతుంది అప్పుల కుప్పను చేసి…ఖాళీ బిందెలు ఇచ్చారు లక్ష కోట్లలో కెసిఆర్‌ నుంచి లక్ష రాబట్టాం అసెంబ్లీలో బావాబామ్మర్దులు తంటాలు పడ్డారు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ…

పట్టణ ప్రాంతాల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

హైదరాబాద్‌, పీసీబీ, డిసెంబర్‌ 27 : వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర రాష్టం వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బుధవారం ప్రారంభమైంది. గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ హైదరాబాద్‌లోని లాలాపేట్‌ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించే వీడియో వ్యాన్‌ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ…

కాంగ్రెస్ కు ‘సంజీవని’ భారత్ జోడో యాత్ర

 ( భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ) భారతదేశంలో జాతీయతా భావం, నూతన చైతన్యం, వలసవాద వ్యతిరేక జాతీయోద్యమాలు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తరువాత ప్రారంభమైనాయి.ఆధునిక విద్య, పాశ్చాత్య విజ్ఞానం వల్ల ప్రభావితమైన మధ్య తరగతి మేధావి వర్గం జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వంపై…

నేటి నుండి ‘ప్రజాపాలన’

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో ఇంతకాలం సాగిన రాజరిక పాలనకు భిన్నంగా ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతామని చెబుతూవొచ్చిన కాంగ్రెస్‌ ప్రజల నమ్మకం వమ్ముకాకుండా అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలకు కూడా నేడు శ్రీకారం…

మతోన్మాద ఫాసిజం పై పౌరసమాజం సంఘటితం కావాలి

అన్ని సామాజిక మరియు రాజకీయ శక్తులు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో, బీజేపీ  అధికారంలోకి రాకుండా నిరోధించడానికి తీవ్రంగా కృషి చేయాలి.  భారతదేశాన్ని ఒక మతతత్వ రాజ్యంగా మార్చే  ఆరెస్సెస్  ఎజెండాను తిప్పికొట్టేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు  చర్యలు తీసుకోవాలి. ఫాసిజం మరియు నియంతృత్వం మధ్య గుణాత్మక వ్యత్యాసం మసకబారుతోంది. ఫాసిజం కూడా నియంతృత్వమే, కానీ…

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన వోట్లు 37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవారం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక వోటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. 84 పోలింగ్‌ కేంద్రాలలో…

CM Revanth Met PM Modi: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి..

పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలి రాష్ట్రానికి రావల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి సిఎం రేవంత్‌తో కలిసి ప్రధాని మోదీతో భేటీ వివరాలను మీడియాకు వెల్లడిరచిన డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిసామని వెల్లడి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 26 : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని…

ఉస్మానియాలో మృతి చెందిన వారికి కోవిడ్‌

ఇద్దరు జూనియర్‌ డాక్టర్లకూ పాజిటివ్‌… పరీక్షల్లో గుర్తించిన వైద్యులు చనిపోయిన వ్యక్తికి అనేక రోగాలున్నాయి : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కొరోనా వైరస్‌ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. దేశంతోపాటు రాష్ట్రంలోనూ  మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతుంది.…