Tag Today Hilights

ఓయూ కేంద్రంగా వేడెక్కిన రాజకీయం

పోటాపోటీగా విద్యార్థుల ప్రదర్శనలు భారీగా మొహరించిన పోలీసులు విసి రాజకీయ ఒత్తిడికి తలొగ్గారన్న రేవంత్‌ ‌గాంధీభవన్‌ ‌ముందు కెసిఆర్‌ ‌దిష్టిబొమ్మ దగ్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో రాహుల్‌ ‌టూర్‌ ‌నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముందస్తు అరెస్టులకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఎస్‌యు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఓయూలో రాహుల్‌ ‌ముఖాముఖికి…

రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం

రాహుల్‌ ‌సభకు అనుమతి ఎందుకు ఇవ్వరు వి•రైతే ఎక్కడపడితే అక్కడ ధర్నాలు చేయొచ్చు కాంగ్రెస్‌ అం‌టే టిఆర్‌ఎస్‌కు వణుకు పుడుతుంది అరెస్ట్‌లపై మండిపడ్డ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌మండిపాటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పైనే కక్ష సాధింపా..? : టిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌/‌కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో…

రాహుల్‌ ఓయూలో పర్యటించి తీరుతారు

అరెస్టులు, నిర్బంధాలతో నియంత్రించలేరు అదే రోజు చంచల్‌గూడ జైలులో విద్యార్థులను పరామర్శిస్తారు ములాఖత్‌కు జైలర్‌ను కలసి రేవంత్‌ ‌రెడ్డి వినతి పత్రం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 2 : అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ప్రభుత్వం నియంత్రించ లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌ ‌పర్యటన కోసం ప్రజాస్వామ్యయుతంగా అనుమతి కోసం…

నేడు రంజాన్‌ ‌పండుగ

ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి… పాతబస్తీలో భారీ బందోబస్తు రాత్రి పూట జోరుగా సాగిన షాపింగ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 2 : నేడు రంజాన్‌ ‌పండుగ సందర్భంగా నగరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈదుల్‌ ‌ఫితర్‌ ‌ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి  భారీ సంఖ్యలో ముస్లింలు తరలిరానున్న వి•రాలం ఈద్గా, మక్కామసీదు, పాతబస్తీలోని చౌక్‌ ‌మసీదు,…

క్రమశిక్షణకూ, దాతృత్వానికి  ప్రతీక రంజాన్‌  

‌ముస్లింలకు అత్యంత శుభప్రదమైన మాసం రంజాన్‌. అత్యంత భక్తి శ్రద్ధలతో ‘అల్లాహ్‌’‌ను ఆరాధించే అతి పవిత్రమైన మాసం. అంతటా ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసే అద్భుతమాసం. శుభాలు సిరులు వర్షించే వరాల వసంతం రంజాన్‌. ఈ ‌మాసంలోనే పవిత్ర దివ్య ఖుర్‌ ఆన్‌ ‌గ్రంథం అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే ‘రోజా’ వ్రతం…

ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌

‘‘‌రంజాన్‌ ‌మాసం భక్తి శ్రద్ధలకు, పవిత్రతకు, నియమాలకు ప్రతీక. ఏకాగ్రతతో ఆత్మసాక్షాత్కారార్ధమై, పాపములు తొలుగుటకు, లౌకిక విషయాలను పక్కనపెట్టి, పారమార్థిక విషయాలపై దృష్టి సాధించేందుకు కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. రంజాన్‌ ‌సందర్భంగా నెలరోజుల పాటు ఉపవాస దీక్ష తో పాటు, నియమిత వేళలో భుజిస్తూ దీక్షను స్వీకరించేవారు దైవ భక్తి, ఆత్మ సంయమనంతో పాటు,…

పత్రికా ప్రపంచం భవితవ్యమేమిటి?

‘‘‌పత్రికా స్వేచ్ఛ నిర్ధ్వంద్వంగా  హరించబడుతున్నది.పత్రికా స్వేచ్ఛ వలన పాలకులు,ఆధికారులు జవాబుదారీతనం,పారదర్శకతతో పని చేయగలుగుతారు. సమాజ పురోభివృద్ధిలో పత్రికల పాత్ర అత్యధికం.ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ అణగ ద్రొక్క బడుతుందో,ఎక్కడైతే  పత్రికలపై నియంత్రణ కొనసాగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం మనలేదు. భావ స్వేచ్ఛ ఉండదు.నియంతృత్వం ప్రబలుతుంది.అంతిమంగా ప్రజలు పరాజితులుగా మిగులుతారు..’’ నేడు ‘‘వరల్డ్ ‌ప్రెస్‌ ‌ఫ్రీడమ్‌ ‌డే’’ ప్రపంచంలో జరిగే…

రాహుల్‌ ‌పర్యటనపైనే టిపిసిసి ఆశలు

రాహుల్‌గాంధీపర్యటనపైనే తెలంగాణ కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్‌ ‌స్థానాన్ని పక్కకు నెట్టి ఇప్పుడాస్థానంలో బిజెపి చేరింది. ఈ రెండు పార్టీలు 2023లో రానున్న శాసనసభ ఎన్నికలపైన దృష్టి సారిస్తున్నాయి. అధికార తెరాస పార్టీని ఓడించే సత్తా తమకే ఉందని ఈ…

సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయభాష

ఇంగ్లీష్‌లోనే కోర్టు వ్యవహారాలు సరికాదు స్థానిక భాషలతోనే కోర్టులపై సామాన్యుల్లో విశ్వాసం న్యాయ సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన చట్టాలు అమలయితే కోర్టుల జోక్యం ఉండదన్న జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌న్యాయ భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని,…