Tag telugu kavithalu

మరో ప్రపంచ యుద్ధాన్ని ఐరాస నివారించాలి

సెప్టెంబర్‌ 21… అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం United Nations ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 21 ‌తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 1981లో సెప్టెంబర్‌ 21‌న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా…

‘‘‌విలువలు, ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్‌’’

‌పదేళ్ళకే ఆయన్ను మరచిపోయారా? సెప్టెంబర్‌ 21 ‌పదవ వర్ధంతి. 27వ తేదీ 97వ జయంతి ఓట్ల రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలపక్షాన నిలబడి ఉద్యమాలు చేసిన ఉన్నతుడు. క్విట్‌ ఇం‌డియా ఉద్యమం మొదలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల వరకు స్వీయ రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజలతో కలిసి అడుగులేసిన వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా…

‘‘ ‌పట్టింపులేని ప్రజారోగ్యం’’

గోరంత నిర్లక్ష్యం కొండంత  సమస్యకు దారి తీస్తుంది అంటారు పెద్దలు. ఆ ఏమి కాదులే అని  సర్ది పెట్టు కోవటంలోనే పెద్ద ప్రమాదం తలె త్తుతుంది. అదే పరిస్థితి ఇబ్రహీంపట్నం లో కుటుంబ నియంత్రణ క్యాంపులో ఆపరేషన్‌ ‌వికటించి 30 సంవత్సరాల లోపు ఐదుగురు యువతుల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గత  ఆగస్టునెల 25వ…

అం‌తరించి పోతున్న ప్రకృతి సమతుల్యానికి ప్రతీక.. పిచ్చుక

నేడు అంతరించిపోతున్న పక్షుల్లో పిచ్చుక మొదటి స్థానంలో ఉంది. మన స్వార్థం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కనుమరుగు అయ్యేలా చేస్తున్నాం. పిచ్చుకలు ఎన్నో తరాలుగా రైతుల నేస్తాలు..గుప్పెడు గింజలు వేస్తే చప్పున పడి ఉంటాయి. కానీ నేడు సెల్‌ ‌టవర్‌ ‌కాలుష్యం వల్ల, తరిగిపోతున్న ప్రకృతి  సంపద వల్ల ఆహారం కొరత వల్ల, వాతావరణంలో…

హైదరాబాద్‌ ‌సంస్థానంపై పోలీసు చర్య – కొన్ని జ్ఞాపకాలు

– దేవులపల్లి మదన్‌మోహన్‌రావు భారతదేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం హైదరాబాదు సంస్థానం అనేక మతాల వారికి, భాషల వారికి సంగమంగ ప్రసిద్ది చెందింది. అన్ని మతాల భాషలవారు ప్రశాంతంగా జీవితాలు గడిపిన రోజులను మరువలేము. సంస్థానాన్ని పరిపాలించిన రాజు భాష ఉర్దూ భాష అయినందువలన, అందరు ఉర్దూ నేర్చుకొనక తప్పలేదు. ఉర్దూ భాషకు ప్రాముఖ్యత ఉండేదన్న…

థర్డ్ ‌ఫ్రంట్‌ ‌కాదు… మెయిన్‌ ‌ఫ్రంటే

బిజెపియేతర పార్టీలన్నీ ఏకమైతే దేశంలో ఏర్పడేది మెయిన్‌ ‘‌ఫ్రంటే’ అవుతుందన్న నమ్మకాన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన యుపిఏ ప్రభుత్వంపైన ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ప్రభుత్వరంగంలో కొనసాగుతున్న సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ముఖ్యంగా ఆదాని, అంబానీలకు ఈ సంస్థలను దారదత్తం చేస్తుండడం, సంస్కరణల పేరున…

ఇన్నేళ్లు గిరిజన రిజర్వేషన్లు ఏమయినై..?

అమలు చేయకుండా ఎందుకు మోసం చేసినవ్‌ ‌తక్షణమే 10 శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు, ఎంఐఎంలకు వోట్లేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే సీఎంపై బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌…. ‌బండి సంజయ్‌ ‌సమక్షంలో పలువురి చేరిక మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు…

విలీనం, విమోచన కాదు ముమ్మాటికి దురాక్రమణ

‘‘‌తెలంగాణ ప్రజల పోరాటాన్ని ఎదుర్కోలేని నిజామ్‌ ‌పాలకులు, తెలంగాణ సంపదపై కన్నేసిన ఆంధ్ర సంపన్నులు, తెలంగాణ మన చేతికి రాకుంటే కమ్యూనిస్ట్ ‌పోరాటాల ద్వారా భవిష్యత్తులో  మన అధికారనికే ముప్పు వాటిల్లుతుందని భావించిన కాంగ్రెస్‌ ‌కలసి సెప్టెంబర్‌ 17 ‌దాడి చేశారు. ఈ దాడి తాడిత పీడిత ప్రజలపై సామ్రాజ్యవాదులు మూకుమ్మడిగా చేసిన దుర్మార్గపు చర్యగా…

బైరాన్‌పల్లి జనగామ జోనల్‌ ఏరియా కమాండర్‌

‘‘ఆజాద్‌ ‌హైదరాబాద్‌ ’’ ‌ముస్లిం సామ్రాజ్యం. ఆసఫ్‌జాహీ పాలనలో ప్రతీ ముస్లిం ఒక పాలకుడే. ఈ ప్రభుత్వాన్ని కాపాడాలనేది దేవుడి ఆజ్ఞ. అందువల్ల రజాకార్‌ ‌సైన్యంలో చేరి, హిందువులను ఎదుర్కోవాలి అంటూ ఇత్తెహద్‌-ఉల్‌-‌ముస్లిమీన్‌ ‌నాయకుడు ఖాసిమ్‌  ‌రజ్వీ ఇచ్చిన పిలుపు మేరకు రజాకార్లు పట్టణాలు, నగరాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని గ్రామాలపై దాడులు చేశారు. వారి…