Tag Telugu

జ్ఞాపకాల జోలె

సంక్రాంతి పిలిచిందనీ ఊరెళ్ళాను. మిత్రులు రమ్మాన్నారని వీధులన్నీ తిరిగాను. మనిషి మనిషిలో పోలిక పోగులను విప్పుకుంటూ ఊరును మోస్తూ మనసు అర్ధరాత్రి ఇంటికి చేరింది. జ్ఞాపకాల జోలెను రాశిగా పోసి మట్టి కొట్టుకున్న తేదీలను సంవత్సరాలలో ముంచి తేల్చి మాట గుర్తులతో పలకరింపు హోదాలో దగ్గరై ప్రతి ఒక్కరు ఇష్టంగా ముందుకు నడుస్తుంటే తల నెరిసిన…

శతకాలకే మకుటం అప్పాజోస్యుల ‘సుగుణాఢ్య శతకం’

ఒక్కొక్క శతకపద్యం ఒక్కోరీతిలో ఒక సత్యాన్ని ప్రతిపాదిస్తుండటం అప్పాజోస్యుల శతకనిర్మాణ కౌశలం. ‘శతమును మించి సూర్యులును చంద్రులు నంతకుమించి మిన్నునం దతి రథులౌచు దీప్తకిరణాలి వసుంధర జిమ్మవచ్చు, త ద్ద్యుతి యిసుమంత లో నిరుల ద్రోలదు, సూరి వచో మరీచి హృ ద్గతమయి పూన్చులో వెలుగు తాదృశముల్ సుగుణాఢ్యవర్తనల్’ పద్యంలో అనేకమంది సూర్యులు, చంద్రులు మింటనుంచి…

కృష్ణ బిలం

మిత్రుడి కోసం కొన్ని వాక్యాలెప్పుడూ యెదురుచూస్తూ వుంటాయి సముద్ర తీరంలో అలల అరల్లో నింపుకున్న కొన్ని జ్ఞాపకాలు   రాత్రి చెప్పుకున్న వింతైన మాటలూ యీ ప్రపంచానికి నువ్వు చెప్పాలనుకున్న నీ అస్థిత్వము అన్నీ అద్భుతాలే నాకు   యీ విశ్వం గురించి నీ ఆలోచనలు స్థానభ్రంశం చెంది నాదాకా చేరిన క్షణాలు నాకింకా గుర్తే…

షాద్‌నగర్‌లోని గ్లాస్‌ పరిశ్రమలో భారీ పేలుడు

ఆరుగురు కార్మికుల దుర్మరణం పలువురికి తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశ కంప్రెషర్‌ పేలుడుతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28 : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్‌ గాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపనీలో శుక్రవారం భారీ పేలుడు ఘటన సంభవించింది. పరిశ్రమలోని కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.…

అరణ్య పుత్రిక ‘రణధీర-సీతక్క’

అస్నాల శ్రీనివాస్ ఒక అభ్యుదయవాది, ఒక విద్యావేత్త, కవి, రచయిత, సామాజిక స్పృహ కలిగి తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలను నిశితంగా గమనించే వ్యక్తిత్వం. ఎన్నో సామాజిక అంశాలపై వ్యాసాలు రాస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉంటాడు. అటువంటి వాటిలో “అమ్మకానికి అక్షయపాత్ర” వ్యాసం ఒకటి. ఎల్ఐసి లాంటి లాభాలార్జించే ప్రభుత్వ రంగ…

గుల్జార్‌.. ఓ సంగీత సాహిత్య ప్రవాహం!

‘‘ఉదయపు పూజలో మీరు చెప్పే శ్లోకం మొదలు సైకిల్పై ఈలలు వేస్తూ వస్తున్న పాల వ్యాపారి, భిక్షాటన చేస్తూ ఫకీర్‌ పాడుతున్నప్పుడు , వంటగది చుట్టూ అమ్మ హమ్‌ చేసే వరకు సంగీతం మన మనసు లోపల ఖాళీలను సహజంగా నింపుతుందని,  అది మనకు ఎప్పుడూ ప్రియంగానే ఉంటుందని   సంగీతం గురించి….’’ మీరు మీ…

సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఇక లేరు

సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఈ రోజు ఉదయం మృతి చెందారు. సంవత్సర కాలంగా క్యాన్సర్ వ్యాధి కి చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.47 సం. లుగా జర్నలిజం వృత్తి లో ఆయన వివాద రహితుడిగా ప్రశంసలు అందుకున్నారు. సీ ఎమ్ కెసీఆర్ సంతాపం సీనియర్…

బాలల భారతం

  వ్యాస మహర్షి సంస్కృత భాషలో మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు సత్యవతికి పరశరమహర్షి ద్వారా జన్మించాడు. ఒకే రాసిగా ఉన్న వేదాలనునాలుగు భాగాలుగా విభజించి రూపొందించినవాడుగాన వేదవ్యాసుడైనాడాయన. వేదవ్యాసుడు చెబుతూఉంటే వినాయకుడు భారతం వ్రాశాడు. పద్దెనిమిది పర్వాలుగా మహాభారతాన్ని వ్యాసుడు లక్ష పాతికవేల శ్లోకాలుగా మనకు అందించాడు. నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆది…