Tag #TelanganaNews

బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటం

-42శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం -కామారెడ్డి డిక్లరేషన్‌ ‌తుంగలో తొక్కిన అధికార పార్టీ -బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శ బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. వోట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.…

పంచాయితీ ఎన్నికలపై సీఎం ఫోకస్‌

CM Revanth Reddy

‌డిసెంబ‌ర్‌ 1నుంచి సీఎం రేవంత్‌ ‌జిల్లాల పర్యటన  ‌పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో సీఎం మరోమారు జిల్లాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థలను గెలిపించేందుకు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో  జిల్లాల పర్యటనకు ఆయ‌న‌ ‌సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం ఆరు రోజుల పాటు సీఎం జిల్లాల టూర్‌ ‌కొనసాగనుంది.…

పంచాయతీ ఎన్నికలకు లైన్‌ ‌క్లీయర్‌

-ఈ ‌దశలో స్టే విధించలేం -స్టే ఎలా విధిస్తాం? పిటిషనర్‌ను ప్రశ్నించిన ధర్మాసనం  ‌పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సబ్‌ ‌క్యాటగిరీ రిజర్వేషన్‌ ‌లేనందుకు రు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా..? అని పిటీషనర్‌ను  హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీ…

కేసీఆర్‌ ‌దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదు

-ఉనికి కోసం దీక్షాదివస్‌ ‌పేరుతో డ్రామాలు -సోనియా దయవల్లనే తెలంగాణ సాకారం -ఎస్సీ,ఎస్టీ, బిసి విద్యార్థుల త్యాగాలు మరువలేనివి -బీసీ రిజర్వేషన్ల అంశం ముగియలేదు -మీడియాతో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌  ‌తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌చేసిన దీక్ష కారణంగానే తెలంగాణ రాలేదని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌…

మేడారం జాత‌రకు  విస్తృత ఏర్పాట్లు

యుద్ద‌ప్రాతిప‌దిక‌న అభివృద్ది ప‌నులు :   మంత్రి పొంగులేటి ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మేడారం ఆదివాసీ గిరిజన జాత‌ర‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వ‌రంగ‌ల్ ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. భ‌విష్య‌త్తు త‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని  మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను…

ప్ర‌త్యేక రాష్ట్రంలోనూ బీసీల‌కు జ‌రిగేది అన్యాయ‌మే!

– జ్యోతిరావు ఫూలే ఆశ‌య సాధ‌న‌కు కృషి చేద్దాం – బీసీ డిక్ల‌రేష‌న్ పేరుతో మోస‌గించిన కాంగ్రెస్‌ – అశాస్త్రీయ డేటాతో కోర్టుల్లో అభాసుపాలు – 42% ప‌ద‌వులు బీసీల‌కు ఇవ్వొచ్చుగా? – అబ‌ద్ధాల‌తో నెట్టుకొస్తున్న రేవంత్‌ – రాజ్య‌స‌భ స‌భ్యులు డా.ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శ‌ మహాత్మా జ్యోతిరావు ఫూలే  ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త…

నర్సాపూర్ కాంగ్రెస్‌, బీజేపీలకు షాక్.. బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు.

*కాంగ్రెస్, బీజేపీలవి దొంగ నాటకాలు..  *బీజేపీది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు.. అది సబ్కా బక్వాస్ *రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. పేదల పథకాలకు ఎసరు పెట్టే కటింగ్ మాస్టర్. *-మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం   మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో…

బీఆర్ ఎస్ లోకి నర్సాపూర్ కాంగ్రెస్ నేతల భారీ చేరికలు

*నర్సాపూర్ కాంగ్రెస్‌కు భారీ షాక్..బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు* *స్థానిక సంస్థల్లో ఎగిరేది గులాబీ జెండాయే: మాజీ మంత్రి హరీష్ రావు* మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి ,బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్…

పంచాయతీ ఎన్నికలో జాక్‌పాట్‌

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్‌పాట్‌ ‌తగిలింది. వికారాబాద్‌ ‌జిల్లా బషీరాబాద్‌ ‌మండలం మతన్‌ ‌గౌడ్‌ ‌గ్రామంలో సర్పంచి అభ్యర్థి ఎస్టీ రిజర్వేషన్‌ ‌ఖరారైంది. గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉండటంతో ఆ కుటుంబానికి జాక్‌పాట్‌ ‌తగిలింది. గ్రామంలో 494 మంది వోటర్లు 8 వార్డులు ఉన్నాయి. గ్రామంలో ఎరుకలి భీమప్పకు అవకాశం దక్కడంతో…