Tag telangana updates

సమన్వయంతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగేందుకు కృషి

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళిక మూసీ నది అభివృద్ధికి అటంకాలు కలుగకుండా చర్యలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 07 : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌కు ఉన్న ఇమేజ్‌ మరింత పెరిగే విధంగా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు పోవడంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ…

తెల్ల రేషన్‌ కార్డుతో పథకాలకు లంకె ముందే ఎందుకు చెప్పలేదు

ప్రభుత్వ తీరును తప్పు పట్టిన బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ బాల్క సుమన్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : తెల్ల రేషన్‌ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం…

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం 10న మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై వాడివేడి చర్చకు అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.…

హైదరాబాద్‌ నిలోఫర్‌ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం

మంటలను ఆర్పివేసిన  ఫైర్‌ సిబ్బంది…తప్పిన ముప్పు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : హైదరాబాద్‌ నిలోఫర్‌ హాస్పిటల్‌ మొదటి అంతస్తు ల్యాబ్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో హాస్పిటల్‌ లోపల దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు, హాస్పిటల్‌ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తక్షణమే ఈ ప్రమాదంపై అధికారులు స్పందించారు. జరిగినది స్వల్ప అగ్ని…

భారతదేశ దార్శనికుడు భారతరత్న డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌!

రెండువందల సంవత్సరాల వలస పరిపాలన నుంచి భారతదేశాన్ని విముక్తి పరుచుటకై స్వతంత్ర ఉద్యమంలో తమ ప్రాణాలను జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు మహనీయులు ఎందరో. వీరిలో ప్రముఖులు భారతదేశ మూడవ రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌. దేశానికి స్వతంత్రం వచ్చాక కూడా దేశ అభివృద్ధిలో దేశ ప్రజలను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుటలో తన వంతు కృషిచేసిన మహనీయుడు.…

బిఆర్‌ఎస్‌ను టచ్‌ చేసిన కాంగ్రెస్‌

పెద్దపల్లి ఎంపిని పార్టీలో చేర్చుకుని బిఆర్‌ఎస్‌ సవాల్‌కు జవాబు పార్లమెంట్‌ ఎన్నికల కోసం కార్యకర్తలను సిద్ధ చేసున్న కాంగ్రెస్‌ అంతర్ఘత సమావేశాలతో కార్యకర్తలకు ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో బిఆర్‌ఎస్‌, బిజెపి (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 : రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీల మధ్య…

‘హరితనిధి’ పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఖర్చు

వొచ్చిన ప్రతీ రూపాయికీ పక్కాగా లెక్క   ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం హరితనిధిపై అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : పర్యావరణపరంగా ప్రపంచ వ్యాప్తంగా వొస్తున్న మార్పులు పెనుసవాలుగా మారుతున్నాయని, పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అటవీ పర్యావరణం,…

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు…

సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ సవిూక్ష మంత్రులు అందుబాటులో ఉండాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు  సూచన హైదారబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : నేటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. శాసనసభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కోఆర్డినేట్‌ చేసేందుకు, త్వరితగతిన…

పర్యాటక కేంద్రంగా మేడారం అభివృద్ధి

జాతరకు ఏర్పాట్లు పూర్తి శాశ్వత ఏర్పాట్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి సీతక్క మేడారం జనజాతర సందడి షురూ…కన్నెపల్లిలో గుడిమెలిగే పండగ ప్రారంభం ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : మేడారం జాతర అభివృద్ధికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క  అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కల్పనపై నిత్యం…