సమస్య ఆర్టీసీ కార్మికులది కాదు, తెలంగాణ సమాజానిది!

“ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉన్నది. అది 2019 సమ్మెలో కూడా ప్రధానమైన డిమాండే. సంస్థ ప్రభుత్వంలో భాగంగా మారితే, సంస్థను, ఉద్యోగులను పట్టి పల్లారుస్తున్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వానికి తప్పనిసరి తక్షణ బాధ్యతగా మారుతుందని, అలా సంస్థ భవిష్యత్తుకు హామీ దొరుకుతుందని, కార్మికులు ప్రభుత్వోద్యోగులుగా మారి, ఇతర ఉద్యోగులతో సమాన…
