Tag telangana political updates

ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలి

ఫ్యాక్టరీతో వొచ్చే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ‌తా.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నిర్మల్ జిల్లా దిలావ‌ర్ పూర్ మండలం దిలావ‌ర్ పూర్ – గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌ను నిలిపివేయాల‌ని ప్రొఫెస‌ర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజాగళం పేరుతో దిలావ‌ర్ పూర్ మండల కేంద్రంలో…

గ్రూప్ అభ్యర్థుల అక్రమ అరెస్ట్ 

మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం గ్రూప్స్ అభ్యర్థుల అరెస్టు పట్ల  మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను వెంటనే విడుదల…

గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కూడా రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు

‌న్యూ దిల్లీ, అక్టోబర్‌ 16: ‌రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కూడా నలభై కిలోమీటర్ల రేడియస్‌ ‌లో నిర్మాణం చేపట్టాలని, బాధితులకు నష్టపరిహారం పెంచాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ ‌గడ్కారీని కోరినట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. బుధవారం న్యూ దిల్లీ లోతెలంగాణ భవన్‌ ‌లో మీడియా సమావేశం లో మాట్లడుతూ తెలంగాణకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లు ఎక్కువ కేటాయించాలని..స్వచ్ఛ భారత్‌ ‌నిధులు పెంచాలని..చెరువులు బాగు చేయడానికి నిధులు ఇవ్వాలని..స్ట్రాటజిక్‌ ‌నాలా డెవలప్మెంట్‌ ‌ప్రోగ్రాం కి నిధులు ఇవ్వాలని కొరినట్లు తెలిపారు.మన ప్రజలు ఇచ్చిన రిప్రజెంటేషన్లను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు కానీ ఒక్క మంత్రి కూడా మాట్లాడటం లేదు ముఖం చాటేస్తున్నారు. ఏదన్నా అంటే ముఖ్యమంత్రిని కలవమంటున్నారు. అది అందరికీ సాధ్యమా ? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న ఓఆర్‌ఆర్‌ ‌కి 40 కిలోమీటర్ల దూరంలో రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్తున్నారు. కానీ గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కేవలం 28 కిలోమీటర్ల లోపే రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డును ఫామ్‌ ‌చేస్తున్నారు. అక్కడ రైతాంగం ఇప్పటికే ప్రాజెక్టుల కోసం, కాలువల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం భూములు కోల్పోయాము, చివరికి అక్కడ వేస్తున్న కరెంటు లైన్ల కోసం కూడా భూములు ఇచ్చి ఉన్న భూమితో బ్రతుకుతున్నాము మమ్ముల్ని బికారీలను చేయవద్దు అని ఉద్యమం చేస్తున్నారు. కోటి రూపాయలు ఉన్న భూమికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం మాత్రమే ఇచ్చారు. మళ్లీ రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు పేరుతో తమను రోడ్డు మీద పదవేయవొద్దని మా దగ్గరికి వొచ్చి రిప్రజెంటేషన్‌ ఇస్తే..నితిన్‌ ‌గడ్గరీని కలిసి వారి బాధను తెలియజేశాను. సంపూర్ణ నివేదిక అందిస్తాము. గడ్గరి మీటింగ్‌ ఏర్పాటు చేసి దీనికి పరిష్కారం చూపిస్తామని తెలియజేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ ‌లాల్‌ని కలిశాము.గతంలో కేంద్రం 2 లక్షల 40 వేల ఇళ్లు ఇస్తే కెసిఆర్‌ ‌ప్రభుత్వం వాటిని కట్టలేకపోయింది. కట్టిన వాటిని కూడా పంచ లేకపోయారు. పంచినవి కూడా స్థానికులకు కాకుండా వేరేవాళ్లకు ఇచ్చారనే అపవాదు ఉంది. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళు ఈ దఫా ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి కేటాయించాలని, అది కూడా నిజమైన పేదవారికి దక్కేలా విధివిధానాలు ఉండాలని మంత్రిని కోరాము. తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారని ఈటల పేర్కొన్నారు.

స్వచ్ఛ భారత్‌ ‌నిధులు పెంచాలి కేంద్ర మంత్రులను కోరిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌న్యూ దిల్లీ, అక్టోబర్‌ 16: ‌రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కూడా నలభై కిలోమీటర్ల రేడియస్‌ ‌లో నిర్మాణం చేపట్టాలని, బాధితులకు  నష్టపరిహారం పెంచాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ ‌గడ్కారీని కోరినట్లు మల్కాజిగిరి…

దీపావళికి ముందే మిగిలిన వారికి రుణమాఫీ

త్వరలో రైతు భరోసా  రైతులకు అనుకూలంగా ప్రభుత్వం 24 గంటల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తాం అనేక నిర్ణయాలు తీసుకున్నామన్న కోమటిరెడ్డి పంటరుణం రూ.2 లక్షల కన్నా పైనున్న వారికి విడతల వారీగా డబ్బులు జమ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడి నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్‌16:  ‌రైతు సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్స్‌ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం!

ఒక జిల్లాలో 6వ ర్యాంక్‌ వచ్చిన బీసీ డీ అబ్బాయికి స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘిక శాస్త్రంలో ఉద్యోగం రాలేదు, కానీ 42వ  ర్యాంకు వచ్చిన ఓసి అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అదే జిల్లాలో 61వ ర్యాంకు వచ్చిన ఎస్సీ అమ్మాయికి జాబ్‌ రాలేదు, 452వ ర్యాంకు వచ్చిన  ఓసి అమ్మాయికి జాబ్‌ వచ్చింది. మరొక జిల్లాలో…

దేశం కోసం రాజ‌కీయాల‌క‌తీతంగా ప‌నిచేస్తాం..

Navy Radar Center

నేవీ రాడ‌ర్ కేంద్రంపై అపోహ‌లు వ‌ద్దు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దేశ ర‌క్ష‌ణ కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా కేంద్రంలో క‌లిసి ప‌నిచేస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు.…

ఈ మౌనం ఎందాకా?

Concerns about KCR's silence.. Criticism

కెసిఆర్‌ మౌనంపై ఆందోళనలు .. విమర్శలు ప్రస్తుత రాజకీయాల్లో కెసిఆర్‌ పేరెత్తకుండా మాట్లాడే పరిస్థితిలేదు. నేటికి ఇరవై నాలుగేళ్ళుగా ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజల మధ్య  నలుగుతూనే ఉన్నారు. రాష్ట్రం నుండి దిల్లీ  వరకు ఆయన చర్చలేకుండా రాజకీయాలులేవన్న పరిస్థితిని కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్కసారే మౌనవ్రతం దాల్చడాన్ని ఎవరూ ఊహించుకోలేకపోతున్నారు. ఈ ఇరవై…

ప్రపంచ స్థాయి మానవ వనరుల తయారీ లక్ష్యం

రాష్ట్ర విద్య‌, వైద్య రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర అక్టోబర్11: మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద‌ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం భట్టి విక్రమార్క,  ఖమ్మం…

విజ‌య‌ద‌శ‌మి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి

Union Minister Kishan Reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌స‌రా శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయమ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంద‌ని, సత్యం, సదాచార మార్గంలో…