Tag Sannivesam

మనోభావాలతో చెలగాటమెందుకు?

Why Mess with Emotions? The Politics of Manipulation and Sentiment

“రేవంత్‌ రెడ్డి,  మొదటి నుంచి తెలంగాణ సాంస్కృతిక ప్రతీకల విషయంలో సున్నితత్వం లేకుండా వ్యవహరిస్తూ వస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కొత్త రూపకల్పన కానీ, సెక్రటేరియట్‌ లో రాజీవ్‌ గాంధీ విగ్రహస్థాపన కానీ, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాల మార్పుకానీ ఉద్యమకారులకు, తెలంగాణ సమాజానికి చాలా మనస్తాపం కలిగించాయి. ప్రత్యర్థులు రేవంత్‌రెడ్డిని చంద్రబాబుతో ముడిపెట్టి విమర్శిస్తుంటారు. ఆయన కూడా…

మంచుకొండలను కూడా మండించిన నేపాలీ జెన్‌-జీ

“మూడోప్రపంచదేశాలలో తమకు గిట్టని ప్రభుత్వాలను కూలదోయడానికి అగ్రరాజ్యాలు, సైనికతిరుగుబాటు వంటి మార్గాలనే కాదు, ప్రజల తిరుగుబాట్లను కూడా ఆశ్రయిస్తాయి. తమకు వ్యతిరేకులైన సద్దాం హుస్సేన్‌ను, గడాఫీని ప్రజలపై నేరాలు చేసినవారిగా అభియోగాలు మోపి శిక్షించాయి. తాము రహస్యముఠాల ద్వారా చేయించే హత్యల కంటె, వీటికి హెచ్చు న్యాయబద్ధత ఉంటుందని ఆధిపత్యదేశాలకు తెలుసు. అట్లాగని, ప్రజల రాజకీయవ్యతిరేకతలన్నీ…

‘తెలంగాణ నమూనా’ దేశమంతా వెలుగుతుందా?

“కాంగ్రెస్‌ మీద మొదట తిరుగుబాటు చేసినవి శూద్ర కులాలే. 1960లలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, వాటి వెనుక, ముందు శూద్రకులాల ఓటర్లు, పార్టీలు ఉన్నాయి. ఈ బిసికులాల పునాదిగా వివిధ జనతాపార్టీలు ఏర్పడి, ఉత్తరాది రాష్ట్రాలలో 70లలో, 80లలో  అవి అధికారానికి వచ్చాయి. అనంతర సమీకరణల్లో ఆ మధ్యేవాదపార్టీలు అధికంగా కాంగ్రెస్‌తోను, కొన్ని బిజెపితోను కలసి ప్రయాణించాయి. రాహుల్‌ గాంధీ హయాంలో మాత్రమే కాంగ్రెస్‌ స్పష్టమైన సామాజిక న్యాయ విధానాన్ని చేపట్టి, బిసి సాధికారత…

ప్రపంచ వేదిక మీద మన ప్రతాపం ఎంత?

శుక్రవారం నాడు భారత భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఒక విద్యాసంస్థ కార్యక్రమంలో మాట్లాడుతూ,  న్యూయార్క్‌ టైమ్స్‌ తో సహా పశ్చిమదేశాల మీడియా ఎట్లా పక్షపాతంతో ఉందో చెప్పారు. పాకిస్థాన్ కు భారత్‌ కలిగించిన నష్టాల ఫోటోలు ఎన్నో మీడియాలో వచ్చాయని, భారత్‌కు నష్టం కలిగిందని చెప్పేవారు ఒక్క ఫోటో కూడా చూపించ లేకపోయారని ఆయన…

పడిపోతారా? పడగొడతారా !?

ఊహలు, కలలు రెండు వైపులా పదును ఉన్న కత్తులు. అవి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని  ఇచ్చేమాట ఎంత నిజమో, మత్తును, మభ్యపాటును, ఆత్మవంచన ను కలిగించే మాట కూడా అంత నిజం. కోలుకోలేని ఓటమి వాస్తవ ప్రపంచంలో ఎదుర య్యాక, ఏదో ఒక అవాస్తవ ఊహను కావులిం చుకుంటే తప్ప, మనోవ్యాధి తీరదు. తెలంగాణ రాష్ట్రమూ, కెసిఆర్‌…

ఈ కైలాసం ఆటలో అన్నీ పాములే, నిచ్చెనలెక్కడ?

వేములవాడ భీమకవి రాజు కళింగ గంగును చూడడానికి వెళ్లాడట. తనని చూసి కూడా రాజు ‘ సందడి తీరిన వెన్క’ రమ్మన్నాడట. కవికి కోపం వచ్చింది. ముప్పై రెండు రోజుల్లో నీ అహంకారానికి కారణమైన వైభవమంతా నశించిపోతుందని శాపం పెట్టాడట. ఇది ఆధునిక కాలం కదా, శాపాలు వగైరా చెల్లుబాటు కావు. జనం మనసులు నొచ్చుకుంటే…