భారీ పేలుడు.. ఎనిమిదిమంది కార్మికుల మృతి

పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో ఘటన పటాన్చెరు, ప్రజాతంత్ర, జూన్ 30: సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎనిమిదిమంది కార్మికులు చనిపోయారు. వీరిలో ఐదుగురు సంఘటన స్థలంలో, ముగ్గురు హాస్పటల్లో మృతిచెందారు. పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు.…
