Tag BJP MP Kishan Reddy

రైతులపై రేవంత్‌ది భస్మాసుర హస్తం

భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : 25 ‌రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండటంతో అక్కడే వాటికి మొలకలొస్తున్నాయని, వాటిని చూసైనా సీఎం రేవంత్‌కు సిగ్గు అనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ‌భస్మాసుర హస్తంగా మారిందన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతోపాటు రేవన్నపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను కిషన్‌ ‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 20 రోజులైనా కాంగ్రెస్‌ ‌సర్కారు ధాన్యం కొంటలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్‌కు ఆయన ఫోన్‌ ‌చేశారు. అయితే స్విచ్‌ ఆఫ్‌ ‌రావడంతో అడిషనల్‌ ‌కలెక్టర్‌తో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ట్రాన్స్‌పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్‌, ‌హమాలీ చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తుందన్నారు. సివిల్‌ ‌సప్లయ్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ‌సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమిషన్‌ ఇస్తున్నదని, రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుందని తెలిపారు. రైతుల ధాన్యం కొనడంలో రాష్ట్ర సర్కారుకు వచ్చిన ఇబ్బంది ఏంటి?’ అని నిలదీశారు. స్థానిక అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే అంత చులకనా.. అంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వస్తే అందరు పరిగెత్తుతారు.. ఇదేనా రైతంటే ఈ ప్రభుత్వానికి గౌరవం అంటూ ఫైరయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ప్రభుత్వం ధాన్యం కాంటా చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నారని విమర్శించారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటని అధికారులను నిలదీశారు. ధాన్యం దళారుల పాల్జేసుకుని నష్టపోవడమే రైతులకు దిక్కా అంటూ మందలించారు.

ధాన్యం కేంద్రాల్లోనే మొలకలొస్తుంటే సీఎంకు సిగ్గులేదా..? కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : 25 ‌రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండటంతో అక్కడే వాటికి మొలకలొస్తున్నాయని, వాటిని చూసైనా సీఎం రేవంత్‌కు సిగ్గు అనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ‌భస్మాసుర…

అత్యాధునిక హంగులతో  చర్లపల్లి రైల్వే స్టేషన్

త్వరలో అందుబాటులోకి రానున్నది  పనుల పురోగతి పర్యవేక్షించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం  తెలంగాణలో కనెక్టివిటీ వేగవంతానికి అనేక చర్యలు తీసుకుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.  ఇందులో భాగంగానే చర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, యాదాద్రి మెట్రోలైన్, కొమురవెల్లికి…

మోదీపై రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితం..

కాంగ్రెస పార్టీ అధ్యక్ష బాధ్యతలు మోసే సత్తా ఆయనకు లేదు.. అలాంటి వ్యక్తికి మోదీని విమర్శించే హక్కు ఎక్కడిది? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీలో ఆత్మవిశ్వాసం తగ్గిందని,తమ కారణంగానే అది జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ పై 140 కోట్ల మంది…

You cannot copy content of this page