నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎస్ఆర్ఎస్పి టెయిల్ ఎండ్ భూములకు రబీ పంటల కోసం సరిపడా సాగునీరు అందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జలసౌధలో ఎస్ఆర్ఎస్పి నీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇఎన్సిలు అనిల్ కుమార్, విజయ బాస్కర్ రెడ్డి, హారేరాం, సిఇలు కే. శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, రమేష్ బాబు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఎస్ఆర్ఎస్పీ పరిధిలోని మొత్తం 9.68 లక్షల ఎకరాలకు రబీ సీజన్ కు గాను ఆన్ & ఆఫ్ పద్ధతిలో నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.డిసెంబర్ 25న నీటిని విడుదల చేశామని ఏప్రిల్ 8 వరకు నీటి సరఫరా ఉంటుందని అయితే చివరి భూములకు నిరందించే విదంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులను ఆదేశించారు.





