– మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను బొందపెట్టాలి
– బీఆర్ఎస్లో చేరిన పలువురు చేవెళ్ల నేతలు
– మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి
గణతంత్ర దినోత్సవాన స్పీకర్పై విమర్శలా : ఎమ్మెల్సీ అద్దంకి
గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ను అవమానించినందుకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ’సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏమిటి? సభ్యుడిగా మీకు సంస్కారముందా? ముఖ్యమంత్రిని అవమానించడం మీది ఏ రాజనీతి? నాయన కేసీఆర్ రాజ్యాంగంతో తెలంగాణ వచ్చిందని చెబుతూ అవమానిస్తున్నారు. రాజ్యాంగ వ్యతిరేకులుగా మారి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారు, నాటకాలు ఆడిస్తున్నారు’ అని ఎమ్మెల్సీ విమర్శించారు. ‘మీరు పదిమంది గురించి మాట్లాడుతున్నారు.. కానీ 39 మందిని పార్టీలో చేర్చుకున్న మిమ్మల్ని ఏమనాలి? మీరు చేసిన రాజ్యాంగ ద్రోహాన్ని ప్రజలు మననం చేసుకుంటున్నారు. ఫ్రస్టేషన్తో చేస్తున్న నాటకాలను ప్రజలు తిరస్కరించారు. మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉండటం దురదృష్టకరం. ఇప్పటికైనా మీరు చేసిన తప్పును గమనించి క్షమాపణ చెబితే మంచిది అని అద్దంకి హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



