– బీఆర్ఎస్ పిలుపుతో జిల్లా బంద్
- స్వచ్ఛందంగా వాణిజ్య సంస్థల మద్దతు
– మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అరెస్ట్
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6:
ఆర్టీసీ డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడారు. అన్నదాతలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుత విధానాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రైతన్నల సమస్యలను గుర్తించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలపై తాము పోరాడుతుంటే రేవంత్రెడ్డి ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులు సరైన గిట్టుబాటు ధరలేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు న్యాయం చేసేవరకు తాము పోరాడతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. నాయకుల అరెస్టులతో జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, గులాబీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



