సీతారామ ఫలాలు అందడం సంతోషకరం

– మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: కేసీఆర్‌ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు నేడు రైతులకు అందడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎట్టకేలకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు ఆన్‌ చేసి నీళ్లు అందించడంతో రైతులు కేసీఆర్‌ కృషిని గుర్తు చేసుకుంటున్నారన్నారు. గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టు విలువ ఏమిటో ఇప్పుడు అనుభవంలోకి వచ్చిందని, నదీ జలాల సద్వినియోగానికి కేసీఆర్‌ చిత్తశుద్ధితో చేసిన కృషికి సీతారామ ప్రాజెక్టు ఓ సజీవ సాక్ష్యమని ఆయన అన్నారు. సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఆన్‌ చేసినట్టే కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి కూడా మోటార్లు ఆన్‌ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన మరోసారి డిమాండ్‌ చేస్తున్నామని హరీష్‌రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *