హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలి

– కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్రకు రేవంత్‌ విన్న‌పం

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: హైదరాబాద్‌కు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)ని మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్‌ క్యాంపస్‌ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐఐఎం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్యకనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలను, 16 జవహర్‌ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్‌ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు, ఇతర వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *