– తెలంగాణ రైజింగ్-2047తో ముందుకెళ్తున్నాం
– ఎన్నో సంస్కరణలు చేపడుతున్నాం
– గుడ్ గవర్నెన్స్ కాదు.. స్మార్టు గవర్నెన్స్ కావాలి
– మూసీ విషయంలో రాజకీయం చేయొద్దు
– ఎవరినీ నిరాశ్రయులను చేయం
– శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: దేశంలో ఎన్నో నగరాలున్నా పొలిటికల్ రాజధానిగా దిల్లీ, ఫైనాన్షియల్ కేపిటల్గా ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల గురించి మాత్రమే చర్చించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. శాసనమండలిలో సోమవారం ఆయన మాట్లాడుతూ దిల్లీలో కాలుష్యం కారణంగా పాఠశాలలలకు, కార్యాలయాలకు సెలవులు ఇస్తున్నారు.. ముంబైలో వర్షాలతో వరదలు వచ్చే పరిస్థితి.. అక్కడ నివసించలేని పరిస్థితి కూడాను, బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్, చెన్నైలో వరదలతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ రాక్స్ అండ్ లేక్స్ సిటీ.. అది ఓల్డ్ సైట్ అని మనం చెప్పుకుంటున్నా ఒరిజినల్ సిటీ.. చార్మినార్, గుల్జార్ హౌస్, మనం ఉన్న శాసనమండలి ఎన్నో చారిత్రక కట్టడాలు నగరంలో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న నగరంలో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ప్రధానంగా వాహనాల సంఖ్య పెరిగినందున వీటికి పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రవాణాలో రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్టు, పోర్టు కీలకం. సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసుకున్నామని, మెట్రోను నిర్మించుకున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్-2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని, తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు జోన్లుగా విభజించుకున్నామని, ‘క్యూర్’ పరిధిని సర్వీస్ సెక్టార్గా, ‘ప్యూర్’ను మాన్యుఫ్యాక్చర్ హబ్గా, ‘ రేర్’ను అగ్రికల్చర్ రంగంగా అభివృద్ధి చేయబోతున్నామని వెల్లడించారు. ఔటర్ రింగు రోడ్డు ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అని, ఈ ప్రాంతంలోని కాలుష్య కారక పరిశ్రమలకు ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తే మధ్యతరగతికి భూమి అందుబాటులోకి వస్తుందని, నగరం నివాస యోగ్యంగా మారుతుందని అన్నారు. రోడ్లను అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్ అని మూడు భాగాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రణాళికలు రచించామని సీఎం వివరించారు. 29 ప్రాంతాల్లో జరుగుతున్న పనుల ప్రణాళికలు మీ ముందు పెట్టామని, ఎల్ అండ్ టీతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించిందని, మెట్రోలో లాస్ట్ మైల్ కనెక్టివీటీ లేదని. అందుకే మెట్రోను విస్తరిస్తున్నామని చెప్పారు. మెట్రో విస్తరణకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని, త్వరలోనే విస్తరణను చేపట్టబోతున్నామని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





