బైక్ ను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
కరీంగనర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిపై బైక్ ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తాన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హుస్నాబాద్ నుంచి తోటపల్లికి వెళ్తుండగా కొత్తపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కాసేపు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్తానికుల సమాచారంతో ఘటనా స్తలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




