– 30 వరకు కొనసాగనున్న సమీక్షలు
– ఆయా సమావేశాల్లో సీఎంతోపాటు సంబంధిత మంత్రులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-25 నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివిధ విభాగాల వారీగా మంగళవారం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్కు తుది మెరుగులు దిద్దుతారు. ఈరోజు నుంచి 30వ తేదీ వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరుసగా సమీక్షా సమావేశాలు జరుగుతాయి. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు అన్ని సమావేశాల్లో పాల్గొంటారు. ఆయా విభాగాల సమీక్షలో సంబంధిత మంత్రులు పాల్గొంటారు.
25న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు: సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, ఆయా విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొంటారు.
26న లాజిస్టిక్స్, ఏర్పాట్లు : సీఎంతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సంబంధిత అధికారులు.
27న మౌలిక వసతులు, అభివృద్ధి : సీఎంతోపాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, మొహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సంబంధిత విభాగాల అధికారులు.
28న విద్య, యువజన సంక్షేమం: సాయంత్రం 4 గంటలకు సీఎంతోపాటు మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు: టూరిజం, టెంపుల్ టూరిజం..
మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ సంబంధిత అధికారులు
29న- వ్యవసాయం, సంక్షేమ విభాగాలు : సాయంత్రం 4 గంటలకు: మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సంబంధిత అధికారులు.
సాయంత్రం 6 గంటలకు: మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, మొహమ్మద్ అజారుద్దీన్.
30న- ఆరోగ్య రంగం : సీఎంతోపాటు మంత్రి దామోదర్ రాజనరసింహ సంబంధిత అధికారులు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




